Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుష్మా ఉంటే నేనెట్లొస్తా..! పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ అసంతృప్తి

ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ఉగ్రశిబిరాలపై భారత్ అటాక్ చేసిన దరిమిలా.. ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు పాక్ ఆర్మీకి చిక్కిన వాయుసేన పైలట్ అభినందన్ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.

అబుదాబిలో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) సమావేశానికి తాను హాజరు కావడం లేదని ప్రకటించారు ఖురేషీ. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను గౌరవ అతిథిగా పిలవడమే దానికి కారణమంటూ చెప్పుకొచ్చారు.

Mahmood Qureshi not attended OIC meeting due to sushma swaraj presence

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గేంత వరకు సుష్మాతో తాను భేటీ అయ్యే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఓఐసీ అనేది మాకు సంబంధించిన ఫోరమ్. దాని వ్యవస్థాపక సభ్యుల్లో పాకిస్థాన్ కూడా ఉంది. ఆ సమావేశానికి హాజరయి పాకిస్థాన్ అభిప్రాయం స్పష్టంగా చెప్పే అవకాశం మాకుంది. అది మా హక్కు కూడా. అంతేగానీ ఎలాంటి సంబంధం లేని ఇండియాను ఈ సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారంటూ నిర్వాహకులపై మండిపడ్డారు. భారత్ కనీసం ఓఐసీ అబ్జర్వర్ కూడా కాదని గుర్తుచేశారు. ఈ సమావేశానికి తొలిసారిగా భారతదేశానికి ప్రాతినిధ్యం దక్కింది. గౌరవ అతిథిగా సుష్మా స్వరాజ్ వెళ్లడం విశేషం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+