భయానకం- గుండెలు అద్దిరిపోయే విజువల్స్
చైనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిచువాన్ ప్రావిన్స్లో కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన హాంగ్కీ వంతెన కుప్పకూలింది. భారీగా కొండచరియలు విరిగిపడటంతో తునాతునకలైంది. టిబెట్కు వెళ్లే జాతీయ రహదారిలో కీలకమైన వంతెన ఇది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సిచువాన్ ప్రావిన్స్ అధికారులు వెల్లడించారు.
చైనా ప్రధాన భూభాగాన్ని టిబెట్తో కలిపే ఈ వంతెన- ఆ దేశ కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది. కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి వంతెనపై పడ్డాయి. వాటి ధాటికి అది ఏ మాత్రం తట్టుకోలేకపోయింది. పేకమేడలా కుప్పకూలింది. ఈ సంఘటన సిచువాన్ ప్రావిన్స్ మార్కాంగ్ సిటీ సమీపంలోని షువాంగ్జియాంగ్ కౌ జలవిద్యుత్ కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది.

కొలిన్ రగ్ అనే ఎక్స్ హ్యాండిల్ లో ఈ వీడియో పోస్ట్ అయింది. బ్రిడ్జి కూలుతున్న సమయంలో తీసిన విజువల్స్ భీతావహంగా కనిపించాయి. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోన్నాయి. కొండచరియలు విరిగిపడటం కూడా ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. అవి పడిన వెంటనే భారీగా ధూళి ఆకాశంలోకి ఎగజిమ్మింది. వంతెన శిథిలాలు గాల్లోకి ఎగిసిపడటం ఇందులో చూడొచ్చు.
క్షణాల్లో వంతెన కింద భూమి కుంగిపోవడం, దాని స్తంభాలు ఒరిగిపోవడం, అవన్నీ కూడా నదిలోకి కూలిపోయాయి. చైనా నైరుతి దిశగా ఉంటుందీ సిచువాన్ ప్రావిన్స్.758 మీటర్ల పొడవైన వంతెన ఇది. టిబెట్ తో అనుసంధానించడానికి చైనా దీన్ని నిర్మించింది. కొన్ని నెలల కిందటే ఇది లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయి సంవత్సరం కూడా కాలేదని స్థానిక మీడియా తెలిపింది. కొండచరియలు విరిగిపడటం వల్లే వంతెన కూలిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్లు వివరించింది.
NEW: 758-meter-long Hongqi bridge in the southwestern province of Sichuan, China collapses just months after opening.
— Collin Rugg (@CollinRugg) November 11, 2025
Construction on the Chinese bridge had finished earlier this year, according to Reuters.
The collapse of the bridge was reportedly triggered by… pic.twitter.com/fyxMAW9JNN
ఇది ప్రమాదకర స్థితికి చేరుకుందనే విషయాన్ని అధికారులు ముందుగానే పసిగట్టారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ వంతెన మీదుగా రాకపోకలను నిలిపివేశారు. సమీపంలోని కొండచరియలు, రహదారులపై పగుళ్లతో పాటు, భూమి కదులుతున్న సంకేతాలు కనిపించడంతో ప్రమాదాన్ని గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు. ఏటవాలుగా ఉన్న పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటమే కూలిపోవడానికి కారణం. ప్రమాద నష్టాన్ని అంచనా వేయడానికి, వంతెన భద్రత గుర్తించడానికి అత్యవసర, రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications