తీవ్ర ఆందోళనలో భారత్- ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటూ
ఇరాన్- ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్ పై మిస్సైళ్లు, డ్రోన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్ ఇది. టెహ్రాన్ లో వరుస పేలుళ్లు సంభవిస్తోన్నాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని ఆవరించింది. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ పరిణామాలపై భారత్ అలర్ట్ అయింది. ఇరాన్, ఇజ్రాయెల్ లల్లో నివసించే పౌరులకు అడ్వైజరీని జారీ చేసింది. అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలను మానుకోవడం లేదా వాయిదా వేసకోవాలని కోరింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇరాన్, ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేశాయి. ఇక్కడ భారతీయులందరూ రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని పేర్కొంది.

పరిస్థితులు చేయి దాటుతున్నాయని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సంచారాన్ని నియంత్రించుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ సర్వీసులతో సహా రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటైంది. వెనిజులాలో నెలకొన్న అనిశ్చిత, ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి వివరించింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ ఇరాన్, ఇజ్రాయెల్ లో నివసించే భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని, తమను నిరంతరం సంప్రదిస్తూ ఉండాలని సూచించింది.
పౌరులు తమ నివాస లేదా పని ప్రాంతంలో సమీపంలోని రక్షణ స్థలాలను తెలుసుకుని వాటికి దగ్గరగా ఉండాలని, స్థానిక వార్తలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం పర్యవేక్షించాలని కోరింది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవడానికి https://www.oref.org.il/eng ను సందర్శించాల్సి ఉంటుంది. ఏ అత్యవసర పరిస్థితికైనా, 24x7 హెల్ప్లైన్ +972-54-7520711 లేదా [email protected] ద్వారా రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
ADVISORY
— India in Israel (@indemtel) February 28, 2026
In view of the prevailing security situation in the region, all Indian nationals in Israel are advised to exercise utmost caution and remain vigilant at all times.
2. Indian nationals are strongly advised to strictly adhere to the safety guidelines and instructions… pic.twitter.com/SBWmNLgIsS
వ్యాపారం, ఇతర వ్యక్తిగత పనులపై ఇరాన్ కు వెళ్లిన భారతీయులు కూడా వెంటనే స్వదేశానికి తిరిగి రావలని కోరింది. భద్రతా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఇజ్రాయెల్లో నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా, అప్రమత్తంగా, అత్యంత జాగ్రత్తగా ఉండాలని టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచించింది. ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కోరింది.
-
యుద్ధం వేళ మోదీ చాణక్యం.. కర్ర విరక్కుండా.. పాము చావకుండా..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications