నేపాల్లోని భారత్ ఎంబసీ వద్ద పేలుడు, ఎవరికీ ఏం కాలేదు
ఖాట్మాండ్: నేపాల్లోని బీరత్నగర్ భారత్ ఎంబసీ వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. ఇక్కడ తాత్కాలిక ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం ఉంది. ఇది ఖాట్మాండుకు 380 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ పేలుడు ధాటికి కార్యాలయ గోడలు స్వల్పంగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. గత రాత్రి కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో బాంబు పేలినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు, ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఓ రాజకీయ పార్టీ సోమవారం బీరత్ నగర్లో బంద్కు పిలుపినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో స్థానిక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, నేపాల్లో, ఉత్తర బీహార్లో భారీ వరదలు వచ్చినప్పుడు తాత్కాలికంగా ఎంబసీ కార్యాలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అది కొనసాగుతోంది. ఇది బీహార్కు ఆరు కిలో మీటర్ల దూరంలో ఉంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications