అమెరికాలో మరోసారి కాల్పులు.. ఆరుగురు మృతి
అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. తూర్పు మిసిసిపిలోని మూడు వేర్వేరు చోట్ల ఈ కాల్పులు జరిగాయి. క్లే కౌంటీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఇటీవల జరిగిన కాల్పుల్లో అనేకమంది గాయపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో కాల్పులు జరిగాయి. మూడు వేర్వేరు ప్రాంతాలే లక్ష్యంగా కాల్పులు జరిగాయి. అయితే క్లే కౌంటీలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

స్థానిక సమయం ప్రకారం శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఈ దాడులకు పాల్పడిన దుండగుడ్ని అరెస్ట్ చేసినట్లు క్లే కౌంటీ షెరిఫ్ ఎడ్డీ స్కాట్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఫేస్ బుక్ మాధ్యమం వేదికగా ఘటన జరిగిన విధానాన్ని తెలిపారు. ఇక క్లే కౌంటీ ప్రాంతం నార్త్ ఈస్టెర్న్ మిసిసిపి రాష్టంలో ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 20 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే గతేడాది అక్టోబర్ లోనూ ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ సమయంలో ఆరుగురు మృతి చెందగా.. మరో 12 మంది గాయపడ్డారు.
-
అమెరికాకు గుడ్ బై చెప్తే.. భారీగా డబ్బు, ఫ్రీ ఫ్లైట్ టికెట్ -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications