మరిన్ని సంస్కరణలు: సింగపూర్లో మోడీ(పిక్చర్స్)
సింగపూర్: పెట్టుబడులకు ఉత్తమమైన గమ్యస్థానం భారత దేశమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. విదేశీ పెట్టుబడులకు ఇంకా ఆకర్షణీయంగా ఉండేలా మరిన్ని సంస్కరణలను తీసుకురానున్నామని చెప్పారు. మంగళవారం సింగపూర్లో జరిగిన 'భారత్-సింగపూర్ ఆర్థిక సమ్మేళనం'లో పారిశ్రామిక వేత్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత కార్పొరేట్లతో భేటీ అయ్యారు.
భారత్కు వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలనీ, ముఖ్యంగా నవరత్న కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో భాగం పంచుకోవాలనీ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) 2016 నుంచి అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్లో రెండు విమానాశ్రయాలను అభివృద్ధి చేయడంలో ఛాంగి విమానాశ్రయంతో భాగస్వామ్యం కోసం పరిశీలిస్తున్నామన్నారు. సింగపూర్ అంటే ఆసియాకు ఆర్థిక సింహం వంటిదని మోడీ అభివర్ణించారు. భారత్ రూపాంతరీకరణలో ప్రతీ అంశంలో సింగపూర్ ప్రధాన భాగస్వామిగా ఉందన్నారు.
సింగపూర్ ప్రవాసీ సదస్సులో మోడీ
సమైక్యత, సమగ్రతే తారకమంత్రంగా ప్రపంచంలో దూసుకుపోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. భారత్లో అసహన ధోరణులు ప్రబలమవుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో మంగళవారం ఇక్కడ భారతీయులనుద్దేశించి మాట్లాడిన మోడీ ‘సమైక్యత, సమగ్రత భారతీయ సంస్కృతిలో భాగం. ఇదే నినాదంతో, ఇదే మంత్రంతో, ఇదే సందేశంతో ముందుకు సాగండి' అని అన్నారు.
భారత్లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి విధానాలను వివరించిన మోడీ, సమైక్యత, సామరస్య భావనలను బలోపేతం చేయడం ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని కోరారు. అభివృద్ధి పథంలో దేశాన్ని పరుగులు పెట్టిస్తూనే భారతీయుల ఆత్మ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు.

నరేంద్ర మోడీ
పెట్టుబడులకు ఉత్తమమైన గమ్యస్థానం భారత దేశమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. విదేశీ పెట్టుబడులకు ఇంకా ఆకర్షణీయంగా ఉండేలా మరిన్ని సంస్కరణలను తీసుకురానున్నామని చెప్పారు.

నరేంద్ర మోడీ
మంగళవారం సింగపూర్లో జరిగిన 'భారత్-సింగపూర్ ఆర్థిక సమ్మేళనం'లో పారిశ్రామిక వేత్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత కార్పొరేట్లతో భేటీ అయ్యారు.

నరేంద్ర మోడీ
భారత్కు వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలనీ, ముఖ్యంగా నవరత్న కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో భాగం పంచుకోవాలనీ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు.

నరేంద్ర మోడీ
వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) 2016 నుంచి అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నరేంద్ర మోడీ
భారత్లో రెండు విమానాశ్రయాలను అభివృద్ధి చేయడంలో ఛాంగి విమానాశ్రయంతో భాగస్వామ్యం కోసం పరిశీలిస్తున్నామన్నారు. సింగపూర్ అంటే ఆసియాకు ఆర్థిక సింహం వంటిదని మోడీ అభివర్ణించారు. భారత్ రూపాంతరీకరణలో ప్రతీ అంశంలో సింగపూర్ ప్రధాన భాగస్వామిగా ఉందన్నారు.

నరేంద్ర మోడీ
'ఆసియా సింహం గుజరాత్లో మాత్రమే కనిపిస్తుంది. అదే ఆసియా ఆర్థిక సింహం ఇక్కడ సింగపూర్లో మాత్రమే కనిపిస్తుంది' అని చమత్కరించారు.

నరేంద్ర మోడీ
సింగపూర్ చిహ్నంలో కనిపించే ఆసియా సింహాన్ని చూడడానికి భారత్కు, ముఖ్యంగా గుజరాత్కు రావాలని లూంగ్ను ఆహ్వానించారు. సింగపూర్ గాలిలోనే ఎంతో శక్తి ఉందన్నారు.

నరేంద్ర మోడీ
ఎన్నో దేశాలకు ఈ దేశం స్ఫూర్తిగా నిలుస్తోందని చెప్పారు. 'సింగపూర్ నాకేమీ కొత్త కాదు. కానీ వచ్చిన ప్రతిసారీ సరికొత్త స్ఫూర్తిని పొందుతుంటాను. ఈ గాలిలోనే ఆ శక్తి ఉంది.

నరేంద్ర మోడీ
భవిష్యత్తుపై మీ దార్శనిక సామర్థ్యం నుంచి, మీ కళ్లలో కనిపిస్తున్న స్నేహభావం నుంచి ఈ శక్తి వస్తోంది. సింగపూర్ లాంటి ప్రదేశమే మరొకటి లేదని అందుకే అంటారు.

నరేంద్ర మోడీ
సమైక్యత, సమగ్రతే తారకమంత్రంగా ప్రపంచంలో దూసుకుపోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు.

నరేంద్ర మోడీ
భారత్లో అసహన ధోరణులు ప్రబలమవుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో మంగళవారం ఇక్కడ భారతీయులనుద్దేశించి మాట్లాడిన మోడీ ‘సమైక్యత, సమగ్రత భారతీయ సంస్కృతిలో భాగం. ఇదే నినాదంతో, ఇదే మంత్రంతో, ఇదే సందేశంతో ముందుకు సాగండి' అని అన్నారు.

నరేంద్ర మోడీ
భారత్లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి విధానాలను వివరించిన మోడీ, సమైక్యత, సామరస్య భావనలను బలోపేతం చేయడం ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని కోరారు.

నరేంద్ర మోడీ
అభివృద్ధి పథంలో దేశాన్ని పరుగులు పెట్టిస్తూనే భారతీయుల ఆత్మ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications