Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీని ‘కీలక భాగస్వామి’గా గుర్తించిన ట్రంప్.. రంగంలోకి భారత్

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే 'హార్ముజ్ జలసంధి' రక్షణపై భారత్, అమెరికా దేశాలు అత్యంత కీలకమైన అడుగు వేశాయి. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో సముద్ర మార్గాల్లో ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మక చర్చలు జరిపారు. ఈ సంక్షోభ పరిష్కారంలో ప్రధాని మోడీని ఒక 'కీలక భాగస్వామి'గా అమెరికా అభివర్ణించడం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్‌తో వాషింగ్టన్ జరుపుతున్న ప్రతి చర్చాంశాన్ని ప్రధాని మోడీకి ఎప్పటికప్పుడు తెలియజేయాలని (Loop in) అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా కోరారు. "అధ్యక్షుడు ట్రంప్ ఎల్లప్పుడూ మోడీతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపుతారు. హార్ముజ్ జలసంధిని నిరంతరం తెరిచి ఉంచడమే మా ప్రధాన లక్ష్యం. ఇరాన్ నౌకలను కూల్చివేస్తామని బెదిరిస్తున్న తరుణంలో, ఇద్దరు నేతల మధ్య జరిగిన ఈ ఫోన్ కాల్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది" అని గోర్ స్పష్టం చేశారు.

Modi-Trump Strategic Talks Ensuring Global Energy Security Amid Rising Tensions in the Strait of Hormuz

ప్రపంచ శాంతికి భారత్ మద్దతు

ఈ చర్చలపై ప్రధాని మోడీ సామాజిక మాధ్యమం 'X' వేదికగా స్పందిస్తూ.. పశ్చిమ ఆసియా పరిస్థితులపై ట్రంప్‌తో ఉపయోగకరమైన అభిప్రాయ మార్పిడి జరిగిందని ధృవీకరించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించి, వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించడానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ జలమార్గాలు సురక్షితంగా, అందుబాటులో ఉండటం ప్రపంచం మొత్తానికి అవసరమని మోడీ తన అభిప్రాయాన్ని బలంగా వినిపించారు.

యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన

భారత్ ఇంధన భద్రతపై ప్రత్యేక దృష్టి

గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడి ఉంది. హార్ముజ్ జలసంధిలో స్వల్ప అంతరాయం కలిగినా దేశీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వ అధికారులు ఇప్పటికే 'ఆపత్కాల ప్రణాళికలను' (Contingency Plans) సిద్ధం చేశారు. నిత్యావసరాలు, ఇంధన సరఫరాలో ఎలాంటి లోటు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేస్తున్నారు.

తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్

కీలక వాటాదారుగా భారత్

సైనిక ఘర్షణలు మౌలిక సదుపాయాలకు, షిప్పింగ్ మార్గాలకు ముప్పుగా మారుతున్న తరుణంలో అమెరికా దౌత్యం కీలకంగా మారింది. ఇరాన్‌తో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, ఈ గ్లోబల్ సంక్షోభ పరిష్కారంలో మోడీ పాత్రను అమెరికా గుర్తించడం విశేషం. ఇది కేవలం రెండు దేశాల మధ్య చర్చ మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లను కుప్పకూలకుండా కాపాడే అతిపెద్ద దౌత్య ప్రయత్నంగా నిపుణులు భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+