వాటి గురించి మాట్లాడకుండా ఉంటే.. నవాజ్ షరీఫ్ రూ.1000 కోట్లు ఇస్తానన్నారు: ఇమ్రాన్ ఖాన్
పనామా పేపర్ల విషయంపై మాట్లాడకుండా ఉంటే రూ.1000 కోట్లు ఇస్తానని ప్రధాని నవాజ్ షరీఫ్ తనను ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారంటూ ప్రతిపక్ష పార్టీ తెహ్రెక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సంచలన
ఇస్లామాబాద్: పనామా పేపర్ల విషయంపై మాట్లాడకుండా ఉంటే రూ.1000 కోట్లు ఇస్తానని ప్రధాని నవాజ్ షరీఫ్ తనను ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారంటూ ప్రతిపక్ష పార్టీ తెహ్రెక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.
పనామా పేపర్లు బయటపెట్టిన అక్రమార్కుల జాబితాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పేరుందని, ఆయన పదవి నుంచి తప్పుకోవాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే.

ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రలోభంపై ఇమ్రాన్ ఖాన్ మాట్లడుతూ.. పంజాబ్ ముఖ్యమంత్రి స్నేహితుడయిన ఒకరు రెండు వారాల క్రితం తనను కలసి ఈ విషయంపై మాట్లాడారని వ్యాఖ్యానించారు.
ఈ వెయ్యి కోట్ల రూపాయల ఆఫర్ మాత్రమేకాక, షరీఫ్ పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తే మున్ముందు మరింత ఇస్తామని షరీఫ్ ఆ వ్యక్తితో తనకు చెప్పించారని కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అయితే, ఇమ్రాన్ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని పంజాబ్ సీఎం షాబాజ్ షరీఫ్ అన్నారు. తాను ఈ విషయాన్ని కోర్టులో సవాల్ చేస్తానని పేర్కొన్నారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications