24గంటల్లో 6సార్లు కంపించిన నేపాల్: వణికిపోతున్న ప్రజలు
ఖాట్మాండ్: ఇటీవల సంభవించిన భారీ భూకంపానికి సుమారు 9వేల మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయిన ఘటన మరువక ముందే.. తాజాగా గురువారం నేపాల్ దేశంలో ఆరుసార్లు భూమి కంపించింది. 4.0 తీవ్రతతో భూమి స్వల్పంగా కంపించింది. ఈ ప్రకంపనలు గురువారం ఉదయం 5.29గంటలకు సంభవించాయి. దీంతో అక్కడి ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.
జాతీయ భూకంప కేంద్రం(ఎన్ఎస్సి) ప్రకారం.. నేపాల్ రాజధాని ఖాట్మాండ్కు ఈశాన్యంలోని
షుఖ్ దోలఖ జిల్లాలో 4.2 తీవ్రతతో మరో స్వల్ప భూకంపం సంభవించింది. అంతకుముందు మరో రెండు భూకంపనాలు సంభవించాయి. గోర్ఖా-ధాడింగ్ మధ్యలో ఉదయం 3.07, 3.40గంటల కాలంలో 4.0 తీవ్రతతో భూకంపం సభవించాయి.

దోలఖా వద్ద 4.2 తీవ్రతతో రాత్రి 11.36గంటల ప్రాంతంలో 4.2తీవ్రతతో భూమి కంపించింది. ఏప్రిల్ 25న నేపాల్లో సంభవించిన భారీ భూకంపంతో సుమారు 9వేల మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. 21వేల మంది ప్రజలు గాయాలపాలయ్యారు.
7.9 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా, తాజాగా కూడా భూమి తరచూ కంపించడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications