తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా సంఘాల నేతల ఇళ్లపై ఎన్ఐఏ సోదాలు - Newsreel

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా సంఘాల నేతల ఇళ్లలో గురువారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది.
విశాఖపట్నం లాసన్స్ బే కాలనీలోని అడ్వొకేట్ అందులూరి అన్నపూర్ణ ఇంటిపై ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగాయి.
మరోవైపు హైదరాబాద్ నాగోల్లో ప్రజా సంఘాల నేతలు రవి శర్మ, భవానీ ఇళ్లపైనా సోదాలు జరిగాయి. ప్రకాశం జిల్లా టంగటూరు మండలం అలకూరపాడులోని విరసం నాయకుడు కల్యాణ్రావు ఇంట్లోనూ ఉదయం 4.30 నుంచి 11 గంటల వరకు సోదాలు కొనసాగాయి.

మావోయిస్టు సానుభూతిపరులు అన్న నెపంతో ఇదివరకు కూడా వీరి ఇళ్లపై ఎన్ఐఏ పలుమార్లు సోదాలు నిర్వహించింది. ఇలా అక్రమంగా సోదాలు చేయడం ఆపాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు కొరియర్ పంగి నాగన్న కేసు విషయంలోనూ విశాఖతో పాటు తూర్పుగోదావరి, హైదరాబాద్లలో ప్రజాసంఘాల నేతల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.
ఇవి కూడా చదవండి:
- 'గత 116 ఏళ్లలో ఈ స్థాయిలో మంచు కురవడం చూడలేదు’
- మోర్బీ డ్రగ్స్ కేసు: గుజరాత్లో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడానికి, అఫ్గానిస్తాన్కూ ఏమిటి సంబంధం?
- జై భీమ్: IMDb రేటింగులో గాడ్ఫాదర్ను అధిగమించిన భారతీయ సినిమా
- ఆల్బర్ట్ ఎక్కా: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్
- ఆంధ్రప్రదేశ్: ఇళ్ల నిర్మాణం పూర్తయినా మూడేళ్లుగా లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదు?
- పోలండ్-బెలారుస్ సరిహద్దు సంక్షోభం: వేల మంది శరణార్ధులు ఎక్కడి నుంచి వస్తున్నారు?
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
- అంతరిక్షంలో శాటిలైట్ను పేల్చేసిన రష్యా.. కాప్స్యూల్స్లోకి వెళ్లి దాక్కున్న స్పేస్ స్టేషన్ సిబ్బంది
- భూమికి అతి సమీపంలో తిరుగుతున్న భారీ రాతి ముక్క.. ఇది చంద్రుడిదేనా? మరి ఎర్రగా ఎందుకు ఉంది?
- ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రోళ్లు కోట్లాది హిట్లు ఎలా కొట్టేస్తున్నారు..
- భారత్తో విభేదాలు కోరుకోవడం లేదు - బీబీసీ ఇంటర్వ్యూలో తాలిబాన్ విదేశాంగ మంత్రి
- ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications