Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిమిష ప్రియ మరణశిక్షలో బిగ్ ట్విస్ట్

Nimisha Priya's death sentence: అంతర్జాతీయంగా సంచలనం రేపుతోన్న కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష కేసు అనూహ్య మలుపు తీసుకుంది. ఆమెకు ఊరట లభించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేలింది. ఆమెకు విధించిన మరణ శిక్షను యెమెన్ రద్దు చేసినట్లుగా ఎటువంటి అధికారిక సమాచారం లేదని చెబుతున్నారు.

తొలుత- నిమిషా ప్రియా మరణ శిక్షను యెమెన్ రద్దు చేసినట్లు ఇండియన్ గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబుబకర్ ముసలియార్ కార్యాలయం వెల్లడించింది. నిమిషా ప్రియ మరణశిక్షను రద్దు చేయాలని యెమెన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందాల్సి ఉందని పేర్కొంది.

Nimisha Priya s death sentence Inaccurate information says Yemen

2017లో యెమెన్‌కు చెందిన తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన కేసులో నిమిషా ప్రియాను దోషిగా తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిమిష.. సనా కారాగారంలో శిక్షను అనుభవిస్తోన్నారు. అక్కడి చట్టాల ప్రకారం.. ఆమెకు మరణశిక్ష విధించాల్సి ఉంది. దీనిపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిలిపివేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ తనవంతు ప్రయత్నాలు చేసింది.

ప్రముఖ ఎవాంజలిస్ట్, ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సైతం ఆమెకు అండగా నిలిచారు. యెమెన్ దేశాధినేతలో నేరుగా సమావేశం అయ్యారు. నిమిష ప్రియ మరణశిక్షను రద్దు చేయాలని కోరారు. దీంతో యెమెన్.. మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇప్పుడు దాన్ని రద్దు చేసింది.

ఆమె మరణశిక్షను రద్దు చేయడానికి తాజాగా భారత గ్రాండ్ ముఫ్తీ రంగంలోకి దిగింది. ఈ బోర్డు అభ్యర్థన మేరకు షేక్ ఉమర్ హఫీల్ తంగల్ నియమించిన సీనియర్ యెమెన్ ముస్లియార్ మధ్యవర్తిత్వం వహించారు. దీంతో యెమెన్ మరణశిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని బోర్డు వెల్లడించింది.

కాగా- నిమిష ప్రియ కేసు గురించి తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని యెమెన్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం యెమెన్ ప్రభుత్వం తీసుకోలేదని సమాచారం. మరణ శిక్ష రద్దయినట్లు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలు నిరాధారమైనవని విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి.

నిమిషా ప్రియ.. కేరళకకు చెందిన మహిళ. పాలక్కాడ్ ఆమె స్వస్థలం. 2008లో ఉపాధి కోసం యెమెన్ వెళ్లారు. అక్కడ మహదీతో కలిసి క్లినిక్ ప్రారంభించారు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తలాల్ తనను వివాహం చేసుకున్నాడని, వేధిస్తున్నాడని నిమిషా ఆరోపించారు. అంతే కాకుండా పాస్‌పోర్ట్‌ను కూడా లాక్కున్నాడని తెలిపారు.

2017లో తలాల్‌ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మత్తు మందు ఇచ్చి పాస్‌పోర్ట్ తిరిగి తీసుకోవడానికి నిమిషా ప్రయత్నించారని, డ్రగ్స్ డోస్ ఎక్కువ అవడం వల్ల అతను మరణించాడని యెమెన్ అధికారులు తెలిపారు. ఈ కేసులో నిమిషాను అరెస్టు చేసి 2018లో హత్య కేసులో దోషిగా నిర్ధారించారు.

ఆమెకు విధించిన ఉరిశిక్షను అప్పట్లో మే 16న అమలు చేయాల్సి ఉండగా, వాయిదా వేశారు. దీనిపై భారత ప్రభుత్వం తరపున పలు ప్రయత్నాలు జరిగాయి. నిమిషాకు తొలుత జూలై 16న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. 2020లో ఆమెకు మరణ శిక్ష విధించగా, 2023లో ఆమె చివరి అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+