Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భౌతికశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

2015 సంవత్సరానికిగానూ భౌతికశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. తకాకి కజిత (జపాన్), ఆర్థర్ బి.మెక్ డొనాల్డ్ (కెనడా) లకు ఈ పురస్కారం ప్రకటించారు. న్యూట్రినోలు ఎలా పనిచేస్తాయన్న అంశంపై చేసిన పరిశోధనకు గానూ ద రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ పురస్కారం ప్రకటించారు.

 Nobel prize for physics won by Takaaki Kajita and Arthur B McDonald

న్యూట్రినోలపై పరిశోధనకు గాను వారికి ఈ అరుదైన పురస్కారం దక్కింది. తకాకి కజిత జపాన్‌లోని కషివాలో యూనివర్శిటీ ఆఫ్‌ టోక్యోలో పనిచేస్తున్నారు. ఆర్థర్ బి.మెక్ డొనాల్డ్ కింగ్‌స్టన్‌లోని క్వీన్స్‌ యూనివర్శిటీలో పనిచేస్తున్నారు. న్యూట్రినోస్‌కి మాస్‌ ఉంటుందని నిరూపించే న్యూట్రినో ఆసిలేషన్స్‌ వీరిద్దరూ కనుగొన్నారు.

ఇక ఈ ఏడాది తొలి నోబెల్ పురస్కారాన్ని వైద్యరంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు సోమవారం ప్రకటించారు. ఈరోజు భౌతిక రంగంలో ప్రకటించారు. ఈ వారంలోనే రసాయన, శాంతి రంగాల్లో నోబెల్‌ బహుమతులు ప్రకటిస్తారు. ఆర్థిక విభాగంలో వచ్చే సోమవారం ప్రకటించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+