ప్రపంచానికి వణుకు.. కిమ్ కొత్త ఆయుధం! అమెరికా గుండెల్లో దడ!!
ఉత్తర కొరియా మరోసారి తన సైనిక పాటవాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ సముద్రంలో భారీ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. సాధారణంగా భూమిపై ఉండే లాంచ్ సైట్ల నుంచి ప్రయోగాలు చేసే ఉత్తర కొరియా.. ఈ సారి సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. అత్యాధునిక యుద్ధనౌక నుంచి క్రూయిజ్, యాంటీ-షిప్ క్షిపణులను ప్రయోగించడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. అమెరికా, ఇరాన్, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో.. ఉత్తర కొరియా తన నౌకాదళ బలాన్ని ప్రదర్శించడం వెనుక లోతైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గంటల పాటు నింగిలో మిస్సైల్స్ విన్యాసాలు
ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ పరీక్షలు గత ఆదివారం నిర్వహించగా, దాని రికార్డులను మంగళవారం బహిర్గతం చేశారు. ఈ విన్యాసాల్లో రెండు స్ట్రాటజిక్ క్రూయిజ్ మిస్సైల్స్, ఓ యాంటీ-షిప్ మిస్సైల్ను ప్రయోగించారు. ఇందులో క్రూయిజ్ క్షిపణులు ఏకంగా 2 గంటల కంటే ఎక్కువ సమయంలో గాలిలో ప్రయాణించి అందరినీ విస్మయానికి గురిచేశాయి. అదే విధంగా యాంటీ-షిప్ మిస్సైల్ సుమారు 33 నిమిషాల పాటు ప్రయాణించి.. సముద్రంలో ఏర్పాటు చేసిన లక్ష్యానని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. 'చోయ్ హ్యోన్' అనే 5,000 టన్నుల భారీ విధ్వంసక యుద్ధనౌక నుంచి ఈ క్షిపణులను వదిలారు.

కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో మిస్సైల్ ప్రయోగాలు
ఈ క్షిపణి పరీక్షల ప్రక్రియ మొత్తాన్ని ఉత్తర కొరియా అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రయోగం సక్సెస్ కావడంతో ఆయన అధికారులను అభినందించారు. క్షిపణుల పనితీరును సమీక్షించడమే కాకుండా, నౌకాదళంలోకి రాబోతున్న కొత్త యుద్ధనౌకల తయారీ, వాటిలో అమర్చబోయే ఆయుధ వ్యవస్థల గురించి ఆయన సుదీర్ఘంగా చర్చించారు. దేశ నౌకాదళం, అణు సామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందుతుండటంపై కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ రక్షణలో అణు శక్తిని అజేయమైన స్థాయికి తీసుకెళ్లడమే తమ అంతిమ లక్ష్యమని కిమ్ జోంగ్ ఉన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అమెరికాకు బలమైన హెచ్చరిక
ప్రస్తుతం ప్రయోగాలకు వేదికైన 'చోయ్ హ్యోన్' యుద్ధనౌకతో పాటు ఉత్తర కొరియా మరో రెండు అధునాతన యుద్ధ నౌకలను శరవేగంగా నిర్మిస్తోంది. భూతల క్షిపణులపైనే కాకుండా, సముద్రం నుంచి కూడా ఏకకాలంలో దాడులు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా తన ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ఈ పరిణామాలు నేరుగా అమెరికా, దాని మిత్రదేశాలకు ఇస్తున్న హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైనా సంక్షోభం ఎదురైతే తమ స్పందన అత్యంత భయంకరంగా, ఊహించని రీతిలో ఉంటుందని ఉత్తర కొరియా ఈ తాజా ప్రయోగాల ద్వారా మరోసారి స్పష్టం చేసింది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications