కిమ్జొంగ్ అదృశ్యం..: ఆరా తీస్తోన్న అమెరికా
ఆధునిక నియంతగా పేరున్న ఉత్తర కొరియా అధినేత కిమ్జొంగ్ ఉన్.. కొంతకాలంగా కనిపించట్లేదు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా ఆయన గైర్హాజరవుతుండటం అనేక ఊహాగానాలకు తెర తీసింది.
ప్యాంగ్యాంగ్: ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్కు మళ్లీ ఏమైంది? , తీవ్ర అనారోగ్యానికి గురయ్యారా? అధికారిక కార్యక్రమాలు, సమావేశాలకూ ఎందుకు గైర్హాజర్ అవుతున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తర కొరియాలో నెలకొన్న ఆహార, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి ఏర్పాటు చేసిన కీలకమైన పొలిట్ బ్యూరో భేటీకీ ఆయన డుమ్మా కొట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

36 రోజులుగా..
కిమ్ జొంగ్ 36 రోజులుగా కనిపించట్లేదు. బాహ్య ప్రపంచం ముందుకు రావట్లేదు. దీనిపై అధికారంలో ఉన్న వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వట్లేదు. కిమ్ జొంగ్ ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లడం కొత్తేమీ కాదు. గతంలో రెండుసార్లు ఆయన ఇలా అదృశ్యం అయ్యారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. 36 రోజులుగా కిమ్ జొంగ్ ఎలాంటి అధికారిక కార్యక్రమాలకు గానీ, సమావేశాలకు గానీ హాజరు కావట్లేదు.

గతంలో కార్డియో వాస్కులర్ తో..
2020లో కిమ్ జొంగ్ ఉన్ కార్డియో వాస్కులర్ బారిన పడ్డారు. విపరీతంగా పొగతాగడం, భారీ శరీరం కావడం వల్ల కార్డియో వాస్కులర్ కు గురయ్యారు. దీనితో ఆయన హ్యూయంగ్సాన్లోని ఓ విల్లాలో సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తు జరిగింది. కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తరువాత కిమ్ జోంగ్.. రాజధాని ప్యాంగ్యాంగ్కు తిరిగి వచ్చారని, అనంతరం అబ్జర్వేషన్లోకి వెళ్లారని డెయిలీఎన్కే ఆన్లైన్ న్యూస్ పేపర్ పేర్కొంది. అంతకు ముందు 2014లోనూ కిమ్ జొంగ్ సుమారు 40 రోజుల పాటు అజ్ఞాత జీవితాన్ని గడిపారు.

ఆదివారం కీలక భేటీ..
ఈ నెల 5వ తేదీన కిమ్ జొంగ్ ఉన్ సైనిక సమావేశానికి హాజరు కాలేదు. అప్పటి నుంచీ - ఆయన ఏమైపోయారనేది ప్రశ్నార్థకమైంది. సైనిక భేటీలకు ఆయన క్రమం తప్పకుండా హాజరవుతుంటారు. దీనితో పాటు సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశంలోనూ కిమ్ కనిపించలేదు. ఈ భేటీకి ఆయన హాజరయ్యారంటూ నార్త్ కొరియా న్యూస్ తెలిపింది. తన పొరుగు దేశం దక్షిణ కొరియాపై యుద్ధానికి కిమ్ సన్నద్ధమౌతోన్నారనే ప్రచారం సైతం ఊపందుకుంటోండటం చర్చనీయాంశమౌతోంది. తాజా పరిణామాలపై అమెరికా ఆరా తీస్తోన్నట్లు తెలుస్తోంది.

పెద్ద ఎత్తున మిస్సైల్స్ పరీక్షలు..
ఉత్తర కొరియా గత ఏడాది పెద్ద ఎత్తున వివిధ రకాల మిస్సైల్స్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఖండాంతర క్షిపణులు, బాలిస్టిక్స్ మిస్సైళ్లను సంధించిందా దేశం. ఒక్క ఏడాదిలోనే 70 మిస్సైళ్లను ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మెజారిటీ మిస్సైల్ టెస్టింగ్స్ ను కిమ్ జొంగ్ స్వయంగా పర్యవేక్షించారు. దక్షిణ కొరియాతో చిరకాలంగా ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధ ట్యాంకులు, ఫిరంగులను సిద్ధం చేశారు అప్పట్లో. అమెరికా విధించిన ఆంక్షలు, ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను కాదని అణ్వాయుధాలను సిద్ధం చేసుకున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications