యుఎస్ వైమానిక దాడులు: 17 మంది పౌరులు బలి
సిరియా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను అంతం చెయ్యడానికి అమెరికా వైమానిక దాడులు చేస్తున్నది. శుక్రవారం ఉత్తర సిరిమాలో అమెరికా వైమానిక దాడులు జరపడంతో 17 మంది మరణించారు. ఈ వైమానిక దాడులలో 40 మందికి పైగా స్థానిక పౌరులు గాయపడి చికిత్స పోందుతున్నారని మానవహక్కుల పరిశీలకులు అంటున్నారు.
ఉత్తర సిరియా లోని అలెప్పో ప్రావెన్స్ ప్రాంతంలోని బెరిమ్హూరి గ్రామంలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు మాటు వేశారని అమెరికా బలగాలు పసిగట్టాయి. శుక్రవారం ఒక్క సారిగా అమెరికా బలగాలు వైమానిక దాడులకు దిగడంతో ఉగ్రవాదులు హడలిపోయారు.

తీవ్రవాదులు ప్రతిదాడులకు దిగే లోపు 17 మంది పౌరులు మరణించారు. గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీశారు. ఈ దాడులలో 40 మందికి పైగా తీవ్రవాగాయాలై వివిద ఆసుపత్రులలో చికిత్స పోందుతున్నారని సిరియా లోని మానవహక్కుల పరిశీలకులు శనివారం వెళ్లడించారు.
అమెరికా దాడులలో 17 మంది పౌరులు మరణించారని సిరియాలోని మీడియా వెళ్లడించింది. అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ను వదిలి పెట్టమని ఇప్పటికే అమెరికా హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం జరిగిన వైమానిక దాడులలో ఎంత మంది తీవ్రవాదులుమరణించారు అని ఇంకా స్పష్టం కాలేదని మానవహక్కుల పరిశీలకులు అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications