ప్రెంచ్ ఎంబసీలో ప్రెసిడెంట్ ఒబామా... ఫ్రాన్స్కు మద్దతు (ఫోటోలు)
వాషింగ్టన్: పారిస్లో చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయం మీద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ తీవ్రవాదులు చేసిన ఆ దాడిలో ఆ పత్రిక ఎడిటర్ స్టీఫెన్ చార్బోనియర్తో పాటు, నలుగురు కార్టూనిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో 11 మంది చనిపోగా, 10 మంది గాయపడ్డారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ఉగ్రవాదులు పారిపోతూ మహ్మద్ ప్రవక్త తరపున ప్రతీకారం తీర్చుకున్నామని గట్టిగా అరిచారు. ఈ దాడి సీసీ కెమెరాల్లో కూడా రికార్డైన విషయం తెలిసిందే. పారిస్ మృతుల గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫ్రెంచ్ ఎంబసీ సందర్శించారు. అక్కడ సానుభూతి తెలిపిన ఒబామా ఫ్రాన్స్కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.

ప్రెంచ్ ఎంబసీలో ప్రెసిడెంట్ ఒబామా
పారిస్ మృతుల గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫ్రెంచ్ ఎంబసీ సందర్శించారు. అక్కడ సానుభూతి తెలిపిన ఒబామా ఫ్రాన్స్కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.

ప్రెంచ్ ఎంబసీలో ప్రెసిడెంట్ ఒబామా
ఉగ్రవాదుల దాడితో ఫ్రాన్స్లో విషాదం అలముకుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మందిప్రజలు వీధుల్లోకి వచ్చి మృతులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ప్రెంచ్ ఎంబసీలో ప్రెసిడెంట్ ఒబామా
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అనుమానిస్తున్నారు. ఫ్రాన్స్ దేశస్తులైన సోదరులు చెరిఫ్ కౌచీ, సైద్ కౌచీలతోపాటు హమీద్ అనే 18 ఏళ్ల విద్యార్థిని అనుమానిస్తున్నారు.

ప్రెంచ్ ఎంబసీలో ప్రెసిడెంట్ ఒబామా
హమీద్ ఇప్పటికే లొంగిపోయినట్లు తెలుస్తోంది. అతన్ని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించినట్లు భద్రతావర్గాల సమాచారం. చెరిఫ్ కౌచీ, సైద్ కౌచీ ఫొటోలను విడుదల చేశారు. పెట్రోల్ బంకు మేనేజర్ వారిని గుర్తించినట్లు తెలుస్తోంది.
ప్రెంచ్ అంబాసిడర్ గెరార్డ్ ఆరుడ్ చెంత ఉండగా... సంతాపాన్ని పుస్తకంలో బరాక్ ఒబామా తన సందేశాన్ని రాశారు. అంతక ముందు అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి ఒబామా పారిస్ ఘటన జరిగిన నేపథ్యంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో సమావేశమై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికన్ల భద్రతపై చర్చించారని వైట్ హౌస్ తెలిపింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అనుమానిస్తున్నారు. ఫ్రాన్స్ దేశస్తులైన సోదరులు చెరిఫ్ కౌచీ, సైద్ కౌచీలతోపాటు హమీద్ అనే 18 ఏళ్ల విద్యార్థిని అనుమానిస్తున్నారు. హమీద్ ఇప్పటికే లొంగిపోయినట్లు తెలుస్తోంది. అతన్ని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించినట్లు భద్రతావర్గాల సమాచారం.
చెరిఫ్ కౌచీ, సైద్ కౌచీ ఫొటోలను విడుదల చేశారు. పెట్రోల్ బంకు మేనేజర్ వారిని గుర్తించినట్లు తెలుస్తోంది. 2008లో ఉగ్రవాదులకు సహకరించిన కేసులో చెరిఫ్ కౌచీ 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఉగ్రవాదుల దాడితో ఫ్రాన్స్లో విషాదం అలముకుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మందిప్రజలు వీధుల్లోకి వచ్చి మృతులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications