వణికిస్తున్న 'ఫుంగ్-వాంగ్'తుపాన్.. సురక్షిత ప్రాంతాలకు 10 లక్షల మంది !
ఫిలిప్పీన్స్ను 'ఫుంగ్-వాంగ్' పెను తుపాను తీవ్రంగా వణికిస్తోంది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు దేశం మొత్తాన్ని దాటేస్తున్నాయి. తుపాను కారణంగా తూర్పు మరియు ఈశాన్య తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందినట్టు వెల్లడించారు. తుపాను ఉద్ధృతి కారణంగా సముద్రతీర ప్రాంతాల్లో 5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. కాగా పౌర రక్షణ కార్యాలయం అంచనా ప్రకారం ఈ తుపాను సుమారు మూడు కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేయవచ్చని హెచ్చరించింది. ఇప్పటికే 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను కారణంగా మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు ప్రకటించారు.
లూజాన్ ద్వీపంపై ప్రత్యక్ష ప్రభావం..
ఫిలిప్పీన్స్లో అత్యధిక జనాభా కలిగిన లూజాన్ ద్వీపంలోని అరోరా ప్రావిన్స్ వద్ద తుపాను తీరాన్ని తాకింది. స్థానికంగా 'ఉవాన్' అని పిలవబడే ఈ తుపాను 1800 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అధికారులు చెబుతున్న ప్రకారం, దేశ భూభాగంలో దాదాపు మూడింట రెండొంతులు ఈ తుపాను పరిధిలోకి వస్తున్నాయి. అలానే కటండువానెస్ ప్రావిన్స్లో సంభవించిన మెరుపు వరదల్లో ఒక వ్యక్తి.. సమర్ ప్రావిన్స్లోని కాట్బాలొగన్ నగరంలో ఇల్లు కూలిపోవడంతో ఒక మహిళ మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రతతో దృశ్యమానత సున్నా స్థాయికి పడిపోయిందని అధికారులు తెలిపారు.

వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ, సహాయక సిబ్బంది ఇప్పటివరకు 19 మందిని రక్షించారు. బికోల్, తూర్పు విసాయాస్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. కటండువానెస్లోని గిగ్మోటో, ఇసాబెలాలోని డైనపిగ్ తీరప్రాంతాల్లో సముద్రం ఉధృతంగా ఎగిసిపడుతోంది. తుపాను కారణంగా వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు కూలిపోవడంతో అనేక ప్రాంతాలు రోడ్డు మార్గాల నుంచి పూర్తిగా వేరుపడ్డాయి. అనేక ఇళ్లు, వాణిజ్య భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెల్ టవర్స్ దెబ్బతిన్నందున మొబైల్ నెట్వర్క్లు కూడా నిలిచిపోయాయి.
మరోవైపు పౌర విమానయాన శాఖ ఇప్పటికే 380కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. తుపాను కారణంగా రైల్వే, రోడ్డు రవాణా కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తర ప్రావిన్సుల్లోని పాఠశాలలు, కార్యాలయాలకు సోమ, మంగళవారాలు సెలవు ప్రకటించారు. ఫిలిప్పీన్స్ తూర్పు తీరంలో సముద్రం పూర్తిగా ఉధృతంగా మారింది. నౌకాయానానికి నిషేధం విధించగా.. తీరప్రాంత గ్రామాల్లోని ప్రజలను అధికారులు ముందుగానే ఎత్తైన ప్రదేశాలకు తరలించారు. సముద్రంలో ఉన్న మత్స్యకారులు తిరిగి తీరం చేరేందుకు సైన్యం సహాయం అందిస్తోంది.
ఇది ఈ ఏడాదిలో ఫిలిప్పీన్స్ను తాకిన 21వ తుపాను కాగా.. ఇటీవలే వచ్చిన 'కల్మేగీ' తుపాను 224 మంది ప్రాణాలు తీసింది. వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. వరుసగా వస్తున్న ఈ తుపాన్లు దేశానికి భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇక ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సైన్యం, నేవీ, కోస్ట్ గార్డ్ బలగాలను అత్యవసర రక్షణ చర్యలకు సిద్ధంగా ఉంచింది. దేశవ్యాప్తంగా రిలీఫ్ క్యాంపులు, మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. అధికారులు ప్రజలను ఇంట్లోనే ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications