శ్రీలంక నరమేధంలో 359కి చేరిన మృతులు..ఆత్మాహుతి దాడిలో మహిళ పాల్గొన్నట్లు గుర్తింపు..
కొలంబో : ఈస్టర్ పర్వదినాన ముష్కరుల సృష్టించిన విధ్వంసం నుంచి శ్రీలంక ఇంకా తేరుకోలేకపోతోంది. వరుస బాంబుదాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు ఇంతటి ఘాతుకానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసుల గాలింపు ముమ్మురం చేశారు. దాడికి పాల్పడిన ఆత్మాహుతి సభ్యుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

359కి చేరిన మృతులు
ఆదివారం నాడు శ్రీలంకలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో మృతుల సంఖ్య 359కి చేరింది. దాడిలో తీవ్రంగా గాయపడిన వారిలో 38మంది మంగళవారం రాత్రి చనిపోయారు. మరో 500 మంది క్షతగాత్రులకు వివిధ హాస్పిటల్స్లో చికిత్స అందిస్తున్నారు. దాడి జరిగిన నాటి నుంచి 38మంది విదేశీయులు ప్రాణాలకోల్పోగా.. వారిలో 10 మంది భారతీయులు ఉన్నారు.

దాడికి పాల్పడిన వారిలో మహిళ
శ్రీలంకలో బాంబు దాడులకు పాల్పడిన తొమ్మిది మందిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ రువాన్ వాజేవర్థనే ప్రకటించారు. ఆత్మాహుతికి పాల్పడిన వారిలో చాలా మందికి అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలున్నాయని, వారందరూ విదేశాల్లో నివసించిన లేదా చదువుకున్నవారేనని చెప్పారు. ముష్కరుల్లో ఒకడు బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో చదువుకున్నారని, అందుకోసం ఐఎస్ఐఎస్ నుంచి వారికి నిధులు అంది ఉంటాయని వాజేవర్థనే అనుమానం వ్యక్తంచేశారు.

మరో 18 మంది అరెస్ట్
కొలంబోలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీసులు మంగళవారం రాత్రి మరో 18మంది అనుమానుతుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో కలిపి ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 60కి చేరింది. ఉగ్రవాదులు మరిన్ని దాడులు జరిపే అవాకాశముందన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే పిలుపునిచ్చారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications