క్రిస్ట్మస్ వేళ విషాదం: పేలుడులో 100 మంది మృతి
అబుజా : క్రిస్మస్ పర్వదినం వేళ నైజీరియాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నైజీరియాలోని గ్యాస్ ప్లాంటులో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో 100 మందికి పైగా మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
గ్యాస్ సిలిండర్లను రిఫిల్ చేసుకునేందుకు వందల సంఖ్యలో క్రైస్టవులు గ్యాస్ ప్లాంట్ వద్ద బారులు తీరారు. వంటలు చేసుకునేందుకు వారంతా అక్కడ చేరారు. ఈ సమయంలో మంటలు చెలరేగాయి. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గ్యాస్ విడుదల చేస్తూ ట్రక్కు నిలిచిపోయిందని, దీంతో ప్రమాదం సంభవించిందని అంటున్నారు. అది ఓ బాంబు మాదిరిగా పేలిపోయిందని, చాలా శవాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి.












Click it and Unblock the Notifications