పాకిస్తాన్లో ఆక్సిజన్ కొరత.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చనిపోతున్న కోవిడ్ రోగులు
పాకిస్తాన్లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో ఆరుగురు కోవిడ్ రోగులు మృతి చెందారు.
పెషావర్లోని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
భయాందోళనలతో సహాయం కోసం అర్థించామని రోగుల బంధువులు తెలిపారు.
సరైన సమయానికి ఆక్సిజన్ డెలివరీ కాకపోవడంతో దాదాపు 200 మంది రోగులకు కొన్ని గంటలపాటూ తగినంత ఆక్సిజన్ అందించలేకపోయారు.
ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీ సమయానికి సిలిండర్లు అందించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆస్పత్రి అధికారులు ఆరోపిస్తున్నారు.
అయితే, ఆస్పత్రి సిబ్బందిలో కొందరిని విధులనుంచీ తొలగించారు.
ప్రస్తుతం పాకిస్తాన్లో కరోనా వైరస్ కేసులు అధిక స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ 4,00,000లకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,000 మరణాలు సంభవించాయి.
- ఊపిరితిత్తులపై మూడు నెలల తర్వాత కూడా కోవిడ్ ప్రభావం.. కొత్త రకం స్కానింగ్లో బయటపడ్డ నిజాలు
- కరోనావైరస్: మసీదుల్లో రంజాన్ ప్రార్థనలు.. నిబంధనలతో అనుమతిస్తున్న పాకిస్తాన్
ఆస్పత్రికి అందాల్సిన రోజువారీ ఆక్సిజన్ సిలిండర్లు శనివారం సాయంత్రానికి కూడా అందకపోయేసరికి సమస్య ప్రారంభమయ్యిందని స్థానిక మీడియా రిపోర్టులు చెబుతునాయి. బ్యాకప్ కోసం పెట్టుకున్న 300 సిలిండర్లను ఉపయోగించి వెంటిలేటర్పై ఉన్న రోగులకు ఆక్సిజన్ అందించారు.
"రోగులను ఎలాగైనా కాపాడాలని ప్రయత్నించాం. వారి ప్రాణాలను నిలబెట్టమని ఆస్పత్రి సిబ్బందిని శతవిధాలా వేడుకున్నాం" అని మురీద్ అలీ బీబీసీకి తెలిపారు. అలీ తల్లి కోవిడ్ చికిత్సకోసం అదే ఆస్పత్రిలో చేరారు.
కాసేపటి తరువాత కొంతమంది రోగులను ఎమర్జెన్సీ గదికి షిఫ్ట్ చేసారని, అక్కడ ఆక్సిజన్ సరఫరా కొంత మెరుగ్గా ఉందని అలీ వివరించారు.కానీ అక్కడ కూడా ఆక్సిజన్ సరఫరా నిండుకునే పరిస్థితి వచ్చింది. పలువురు రోగులు మరణించారు. అనేకమంది పరిస్థితి విషమంగా మారింది.
ఇక గత్యంతరం లేక... రోగుల బంధువులనే ఆక్సిజన్ సిలిడర్లు కొని తెచ్చుకోమని ఆస్పత్రి సిబ్బంది కోరారు. కానీ కొందరు మాత్రమే కొనుక్కోగలిగారని అలీ తెలిపారు.
కరోనా వార్డ్లో ఐదుగురు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒకరు మృతి చెందారని ఆస్పత్రి ప్రతినిధి తెలిపారు.
- కరోనావైరస్: వ్యాక్సీన్లపై వదంతులు... ఎవరు సృష్టిస్తున్నారు ? ఎలా ఆపాలి ?
- కరోనావైరస్: భారత్లో టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ వ్యూహం ఫలించిందా?
ఎట్టకేలకు ఆదివారం స్థానిక సమయం 4.00 గంటలకు ఆక్సిజన్ సిలిండర్లు ఆస్పత్రికి చేరాయి.
సమయానికి ఆక్సిజన్ సిలిండర్లు అందించకపోవడం "నేరపూరిత నిర్లక్ష్యమని" ఆస్పత్రి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
హాస్పిటల్ ఆక్సిజన్ ప్లాంట్ వద్ద విధుల్లో ఉండాల్సిన సిబ్బంది ఆ సమయంలో అక్కడ లేరని విచారణలో తేలింది. అంతే కాకుండా, సైట్లో ఆక్సిజన్ ట్యాంక్ను రోజు పాక్షికంగానే నింపుతున్నారని కూడా తెలిసింది.
ఇప్పటికే ఆస్పత్రి డైరెక్టర్ను, పలువురు సిబ్బంది సస్పెండ్ చేసారు.
ఇవి కూడా చదవండి:
- గోవా: జీవవైవిధ్యానానికి ఆలవాలమైన మొల్లెం ప్రాంతానికి వచ్చిన ముప్పేమిటి? స్థానికుల ఆందోళనలు ఎందుకు?
- కరోనావైరస్: పాకిస్తాన్ను భయపెడుతున్న కోవిడ్-19.. వైద్యులే వణికిపోతున్నారు
- జుల్ఫికర్ అలీ భుట్టో: ఏరికోరి ఎంచుకున్న ఆర్మీ ఛీఫ్ అధ్యక్ష పదవి నుంచి దించి, ఉరికొయ్యకు వేలాడదీశారు
- రైతుల నిరసన: అన్నదాతల ఆందోళనలకు కమలా హారిస్ మద్దతిచ్చారా? - బీబీసీ రియాలిటీ చెక్
- బాటా, కోల్గేట్, లైఫ్బోయ్, లాక్మే, అలెన్ సోలీ... ఎన్నెన్నో బ్రాండ్లు... ఏది స్వదేశీ? ఏది విదేశీ?
- వీడియో,మ్యాంగో డ్రెస్: ఆహార వృథాపై అవగాహన కోసం మామడి పళ్లతో డ్రెస్ చేసిన టీనేజర్
- పొడుగు పెరగడానికి కాళ్లకు సర్జరీలు: చాలా సమస్యలున్నా పెరుగుతున్న ఆపరేషన్లు.. ఎత్తు పెరగడం మీద ఎందుకంత మోజు?
- ఉత్తర భారతదేశంలో వరి ఎక్కువగా సాగు చేయటమే.. పంట వ్యర్థాల దగ్ధం సమస్యలకు కారణమా?
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు? చరిత్ర ఏం చెబుతోంది?
- రైతు ఆత్మహత్యలు: 'మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)