పాక్పై పెరుగుతున్న ఒత్తిడి: మసూద్ అజార్ను బ్లాక్లిస్టులో చేర్చాలంటూ యూఎన్కు అమెరికా
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడులు, ఆ తర్వాత ప్రతీకార చర్యలకు భారత్ దిగడం..ఆ మరుసటి రోజు పాక్ భారత గగనతలంలోకి రావడం.. అనంతరం భారత వింగ్ కమాండర్ పైలట్ను తమ అధీనంలోకి తీసుకోవడాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రపంచ దేశాలు ఒక్కతాటిపైకొచ్చాయి. పాక్ పై భారత్తో పాటు పలు దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరైపోయింది.
ఫిబ్రవరి 14న జైషే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది భారత జవాన్ల కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ పై తీవ్రమైన ఒత్తిడి ప్రపంచదేశాల నుంచి వస్తోంది. తాజాగా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని ఆశ్రయించాయి. జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్ను బ్లాక్లిస్టులో చేర్చాలని ఒత్తిడి తెస్తున్నాయి.

ఈ మూడు దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతా సమాఖ్యలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. మరో శాస్వత సభ్యత్వం కలిగిన దేశం చైనా మాత్రం మసూద్ అజర్కు అండగా నిలుస్తోంది. అజర్ పై ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితి నాడు భావించినప్పటికీ 2016లో 2017 ఈ నిర్ణయాన్ని చైనా వ్యతిరేకించింది.
జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్ పై ఆర్థిక ఆంక్షలు, ఆయుధాలపై ఆంక్షలు, ఆస్తులపై ఆంక్షలు విధించాలని బ్రిటన్, అమెరికా ఫ్రాన్స్ దేశాలు ఐక్యరాజ్యసమితిని కోరుతున్నాయి. అయితే కమిటీ అందరి ఏకాభ్రిప్రాయం మేరకే నడుచుకుంటుంది. ఇదిలా ఉంటే మిగతా శాశ్వత సభ్య దేశాలు కూడా తమ నిర్ణయాన్ని వెల్లడించేందుకు మార్చి 13 వరకు గడువు ఇచ్చింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమాఖ్య. ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్ సిద్ధంగా ఉన్నట్లు యూఎన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
-
Iran War: ట్రంప్ సీజ్ ఫైర్ ప్లాన్ పై తేల్చేసిన ఇరాన్- కీలక ప్రకటన..! -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications