తన భార్యను కలిసేందుకు కుల్భూషణ్ జాదవ్కు పాక్ అంగీకారం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ తన భార్యతో సమావేశమయ్యేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించింది. మానవత్వ కోణంలో జాదవ్ తన భార్యను కలుసుకునేందుకు ఒప్పుకున్నట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించింది.
ఇందుకు సంబంధించిన లేఖను శుక్రవారం ఇస్లామాబాద్లోని భారత దౌత్య కార్యాలయానికి పంపించనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. జులై నెలలో జాదవ్ తన కుటుంబసభ్యులను కలుసుకునేందుకు అనుమతివ్వాలని భారత ప్రభుత్వం పాక్ అధికారులను కోరింది. కానీ అందుకు పాక్ నిరాకరించింది.

ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ విదేశాంగ శాఖకు వ్యక్తిగతంగా లేఖ కూడా రాశారు. జాదవ్ తల్లి పాక్ వచ్చేందుకు వీసా మంజూరు చేయాల్సిందిగా ఆమె లేఖలో కోరారు.
గూఢచర్యం ఆరోపణలతో భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్కు పాక్ సైనిక కోర్టు ఏప్రిల్ నెలలో మరణశిక్షను విధించిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications