Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ : బలూచిస్తాన్‌లో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్ఏ, సైన్యం బందీ!

భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశానికి గట్టి షాక్ తగిలింది. అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఊహించని ఎదురుదెబ్బతగిలింది. ముఖ్యంగా సహజ వనరులకు నిలయమైనప్పటికీ, అభివృద్ధికి నోచుకోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో వేర్పాటువాద తీవ్రవాదుల కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. దీంతో పాక్ లో అంతర్గత భద్రతా పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వంపై, సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ తాజాగా సవాల్ విసిరింది. కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ తాజాగా స్వాధీనం చేసుకుంది.

ఈ ఘటన బలూచిస్తాన్‌లో భద్రతా పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో కళ్లకు కట్టింది. బీఎల్ఏకు చెందిన అత్యంత క్రూరమైన, ప్రత్యేక శిక్షణ పొందిన 'డెత్ స్క్వాడ్' బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ బృందం మంగుచోర్ పట్టణంలోకి చొచ్చుకెళ్లి, అక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా సంస్థల ప్రాంగణాలను తమ అదుపులోకి తీసుకుంది. ఇంతటితో ఆగకుండా, పట్టణంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నత స్థాయి సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా పట్టుకుంది.

pakistan-in-crisis-bla-takes-control-of-manguchar-town-in-balochistan

ఇటీవల కాలంలో బీఎల్ఏ పాకిస్తాన్ బలగాలపై తన దాడులను తీవ్రతరం చేసింది. కేవలం సాధారణ దాడులకే పరిమితం కాకుండా, మరింత ప్రాణాంతకమైన వ్యూహాలను అవలంభిస్తోంది. దీనికి నిదర్శనమే కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక ఐఈడీ దాడి. ఈ దాడిలో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. భద్రతా దళాలకు ఇది ఒక గట్టి ఎదురుదెబ్బ. తాజాగా, ఒక పట్టణాన్నే స్వాధీనం చేసుకోవడం అనేది బీఎల్ఏ సామర్థ్యం, వారు ఎంత దూకుడుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారో పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు తెలియజేస్తుంది.

బలూచిస్తాన్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సంఘర్షణ గత కొన్ని నెలలుగా మరింత తీవ్ర రూపాన్ని దాల్చింది. తమ భూభాగం నుండి సహజ వనరులను అక్రమంగా దోచుకుంటున్నారని, తమను నిర్లక్ష్యం చేస్తున్నారని పాకిస్తాన్ ప్రభుత్వంపై బలోచ్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు. తమకు స్వయంప్రతిపత్తి కావాలని లేదా పూర్తిగా పాకిస్తాన్ నుండి విడిపోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బీఎల్ఏ వంటి సంస్థలు ఈ డిమాండ్లతోనే పాకిస్తాన్ బలగాలపై గెరిల్లా పోరాటం చేస్తున్నాయి.

మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకోవడం పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. స్థానిక ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి. బీఎల్ఏ యొక్క 'డెత్ స్క్వాడ్' బందీలుగా పట్టుకున్న సైనిక, ప్రభుత్వ అధికారుల భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన పాకిస్తాన్ భద్రతా వ్యవస్థలోని లొసుగులను కూడా ఎత్తిచూపుతోంది. ఒక పట్టణాన్ని తీవ్రవాదులు స్వాధీనం చేసుకోగలిగారంటే, దేశంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతుంది.

పాకిస్తాన్ సైన్యం ఈ పరిణామంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. మంగుచోర్‌ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు వారు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉంది. అయితే, ఇది బీఎల్ఏ ప్రతిఘటనతో మరింత హింసాత్మకంగా మారవచ్చు. మొత్తం మీద, మంగుచోర్ ఘటన బలూచిస్తాన్ సంక్షోభాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+