పాకిస్తాన్: 'మాకు వ్యతిరేకంగా వార్త రాస్తే చంపేస్తాం'
కరాచీ: పాకిస్థాన్ హక్కుల కార్యకర్త, విలేకరి జమాన్ మసూద్ ద్విచక్ర వాహనం పైన వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి హతమార్చారు. దీనిపై పాక్ ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటన చేసింది. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత స్పందించింది.
మసూద్ను తామే హత్య చేశామని పేర్కొంది. అతడు పత్రికల్లో తమకు వ్యతిరేకంగా రచనలు చేయడం వల్లే హతమార్చామని, అతనిలాగే చాలామంది జర్నలిస్టులు తమ టార్గెట్లో ఉన్నారని తెలిపింది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది.

తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే చంపేస్తామని తాలిబన్ కమాండర్ సైఫుల్లా హెచ్చరించాడు. అయితే తాలిబన్లు వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ మానవ హక్కుల సంస్థ తీవ్రంగా మండిపడింది. ఈ కేసు విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, పారదర్శకతతో కూడిన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.
జమాన్ మసూద్ను చంపిన వారిని శిక్షించాలని, వారిని న్యాయస్థానం ముందుకు ఈడ్చాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఓ తుపాకీ పట్టుకొని వచ్చిన ఓ వ్యక్తి జమాన్ మసూద్ను చంపి వెళ్లాడు.
-
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications