Paul Mackenzie:ఆ అడవిలో తవ్వేకొద్దీ శవాలే.. ఏంటీ క్రైమ్ కథా చిత్రమ్..?
Paul Mackenzie:"ఉపవాసం ఉండు... నేరుగా జీసస్ దగ్గరకు వెళ్తావు" అని ఓ చర్చి పాస్టర్ చెప్పడంతో భక్తులు ఆ మాటలను విశ్వసించి రోజులకు రోజులు ఆహారం తీసుకోకుండా ఉండిపోయారు. చివరకు కన్నుమూశారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు పది మంది కాదు.. ఏకంగా 200కు పైగా భక్తులు మృతి చెందారు. ఈ ఘటన కెన్యా దేశంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇంతకీ ఏం జరిగింది
కెన్యా పోలీసుల కథనం ప్రకారం దక్షిణ కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో శవాలు గుట్టలు గుట్టులుగా బయటపడ్డాయి. అసలు ఇన్ని మృతదేహాలు ఇక్కడికి ఎలా వచ్చాయి.. వీరందరినీ ఎవరైనా హత్య చేసి ఈ దట్టమైన అటవీప్రాంతంలో పడేశారా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే తవ్వే కొద్దీ కొన్ని మృతదేహాలు బయటపడుతుంటే మరో 72 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారందరినీ పోలీసులు రక్షించగలిగారు. ఇంకా 600 మంది అదృశ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక విచారణ ప్రారంభించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నేషనల్ చర్చ్ ఆఫ్ ది గుడ్ న్యూస్ అనే చర్చి నిర్వహిస్తున్న మెకాన్జీ అనే పాస్టర్ మాటలు విన్న భక్తులు ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. మరణించేవరకు ఉపవాసంతో ఉంటే నేరుగా జీసస్ దగ్గరకు చేరుకుంటారని ఆయన బోధించాడు. ఆయన బోధనలు విన్న వారు ఆయన మాట ప్రకారమే ఉపవాసం ఉండి చనిపోయారు.

మృతదేహాలను అడవిలో పూడ్చివేశారు. ఒక్కసారిగా ఈ వార్త దావనంలా వ్యాపించడంతో కెన్యా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.కెన్యా అధ్యక్షుడు విలియమ్ రూటో ఘటనపై స్పెషల్ ఎంక్వైరీ కమిషన్ వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున వైద్యులు 112 మృతదేహాలను పరీక్షించారు. అయితే చాలామంది ఉపవాసం ఉండి మరణించారని చెప్పిన వైద్యులు పిల్లలతో సహా మరికొందరి గొంతు నులపడం ద్వారా చనిపోయారని చెప్పారు.
The second phase of exhumation exercise is underway at Shakahola forest. The exhumation process is a legal, medical, and human rights exercise that must be undertaken methodically and carefully to protect the dignity and privacy of families of the deceased persons. The Government… pic.twitter.com/ZqZw6dsTyP
— Kithure Kindiki (@KindikiKithure) May 9, 2023
ఇప్పటి వరకు ఘటనతో సంబంధం ఉన్నవారిని 25 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. వీరిలో ప్రధాన నిందితుడు పాస్టర్ మెకన్జీ కూడా ఉన్నట్లు వెల్లడించారు. పాస్టర్ మెకన్జీ రెచ్చగొట్టే ప్రసంగాలు బోధనలు చేస్తుంటారని అధికారులు చెప్పారు. చదువు అనేది సైతానుతో సమానమని ఒక ప్రసంగంలో చెప్పుకొచ్చినట్లు వెల్లడించారు. ఇక ఈ ఘటనలో అరెస్టు అయిన పాస్టర్ మెకన్జీకి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications