మోడీ-షరీఫ్ మాట్లాడుకోలేదు: చేయి ఊపి, నవ్వేశారు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్లు కొద్దిదూరం నుంచే చిరునవ్వుతో అభివాదం చేసుకున్నారు. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక సదస్సులో ఇది కనిపించింది.
ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక సదస్సు నేపథ్యంలో ప్రధాని మోడీ, షరీఫ్ల మధ్య అనధికార సమావేశం ఉండొచ్చనీ, కనీసం కరచాలనమైనా జరగొచ్చని కొద్ది రోజులుగా ఊహాగానాలు వచ్చాయి. చివరికి వీరిద్దరూ పరస్పర అభివాదంతో సరిపెట్టారు.

మంగళవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమక్షంలో శాంతిపరిరక్షణపై నేతల సదస్సు కోసం ముందుగా ప్రధాని మోడీ సమావేశ మందిరంలోకి వచ్చారు. ఛాంబర్ హాల్లోని బల్లకు కుడివైపు తన స్థానంలో కూర్చున్నారు.
కొద్దిసేపటికి నవాజ్ షరీఫ్ వచ్చారు. బల్లకు ఎడమవైపున కూర్చున్నారు. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుందనగా.. మోడీని చూసిన షరీఫ్ చేయి ఊపి, నవ్వాడు. ప్రతిగా మోడీ చిరునవ్వుతో అభివాదం చేశారు. మోడీ చేయి వూపుతూ అభివాదం చేయగా, షరీఫ్ చిరునవ్వుతో స్పందిస్తూ తల ఊపారు. అయితే, దీనిని కేంద్ర విదేశాంగ శాఖ ఖండించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications