ఎన్నికల పరాజితుడి ప్రతీకారం: ముగ్గురి కాల్చివేత
ఇస్లామాబాద్: స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో ఓటమిపాలైన ఒక రాజకీయ నాయకుడు తన ఓటమికి మీరే కారణం అంటు ముగ్గురు ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తలను అతి దారుణంగా కాల్చి చంపాడు. మరొ ఇద్దరికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బుధవారం పాకిస్థాన్ లోని ఖైబర్ ప్రావిన్స్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గత సోమవారం ఖైబర్ ప్రావిన్స్ ప్రాంతంలో కౌన్సిలర్ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో పలు పార్టీల నాయకులు ఎన్నికలలో పోటి చేశారు.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లీం లీగ్ (పీఎంఎల్), పాకిస్థాన్ తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ పార్టీల మద్య నువ్వా నేనా అని పోటి ఉంది. అయితే కౌన్సిలర్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. అక్కడ చైర్మన్ గా ఖాన్ మహమ్మద్ ఎన్నిక అయ్యారు.
నవాజ్ షరీఫ్ పార్టీ నాయకులు ఓడిపోయారు. ఈ విషయంపై కక్ష పెంచుకున్న నవాజ్ షరీఫ్ పార్టీ నాయకులు బుధవారం తుపాకితో కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. ఖైబర్ ప్రావిన్స్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల కారణంగా ఇప్పటి వరకు 21 మంది హత్యకు గురైనారు.