ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్.. యుద్ధానికి ఫుల్ సపోర్ట్.. ఇక పాకిస్థాన్ ఖేల్ ఖతం
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రదాడిని పుతిన్ ఖండించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన 26 మంది అమాయక ప్రజలకు నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఏరివేయడంలో తమ సహకారం ఎప్పుడూ భారత్ కు ఉంటుందని ప్రధాని మోదీకి పుతిన్ హామీ ఇచ్చారు.
ఇలాంటి ఘటనలకు పాల్పడిన ఉగ్రమూకలను చట్టం ముందు నిలబెట్టేందుకు తమ మద్దతు భారత్ కు ఉంటుందని పుతిన్ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్- రష్యా మధ్య సంబంధాలు మరింత దృఢంగా మారేందుకు గల అంశాలపై పుతిన్, ప్రధాని మోదీ చర్చించారు. ఈ క్రమంలో 80వ విక్టరీ డే సందర్భంగా ప్రధాని మోదీ పుతిన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక భవిష్యత్తులో భారత్ లో నిర్వహించనున్న వార్షిక సదస్సుకు పుతిన్ ను ఆహ్వానించారు ప్రధాని మోదీ.

అంతకుముందు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. రష్యా విదేశాంగ ప్రతినిధి సర్గీ లావ్రోవ్ తో ఫోన్ లో సంభాషించారు. పహల్గాం దాడి తర్వాత భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను లావ్రోవ్ కు వివరించారు. కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని నిర్ణయానికి వచ్చారు.
ఇక పాకిస్థాన్ పై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న దానిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అధికార వర్గాలతో ప్రధాని మోదీ.. భేటీ అవుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తాజాగా వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. పలు కీలక విషయాలు చర్చించారు.
ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాలతో సమావేశం అయ్యారు. వాళ్లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు సింధూ జలాల రద్దుతోపాటు, వీసాల జారీ రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.
President Putin @KremlinRussia_E called PM @narendramodi and strongly condemned the terror attack in Pahalgam, India. He conveyed deepest condolences on the loss of innocent lives and expressed full support to India in the fight against terrorism. He emphasised that the…
— Randhir Jaiswal (@MEAIndia) May 5, 2025
మరోవైపు పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్.. భారత్ ను రెచ్చగొడుతూ వస్తోంది. ఓ వైపు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నా భారత్ తో యుద్ధానికి కాలు దువ్వుతోంది. ఇటీవల 450 కిలో మీటర్ల రేంజ్ అబ్దాలి వెపన్ సిస్టమ్ క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్.. తాజాగా మరోసారి క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications