మరోసారి బాగ్దాద్లో క్షిపణుల దాడులు: అమెరికా ఎంబసీ సమీపంలోనే..
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి క్షిపణి దాడులతో దద్దరిల్లింది. బాగ్దాద్ గ్రీన్ జోన్ పరిధిని రెండు క్షిపణులు తాకాయి. అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో అమెరికా సైన్యం ఉన్నట్లు తెలిసింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు తెలియరాలేదు.
శనివారం ఉదయం కూడా ఇరాక్ లో ఇరాన్ మద్దతున్న పారామిలిటరీ బలగాల కాన్వాయ్ పై వైమానికి దాడులు జరిగాయి. శుక్రవారం ఉదయం బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా చేపట్టిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్కు శక్తివంతమైన కమాండర్గా ఉన్న జనరల్ ఖాసీం సులేమానీ(62) మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో షహీద్ ఆల్ షాబీ దళ డిప్యూటీ చీఫ్ అబూ మహదీ అల్ మొహందిస్ తోపాటు మొత్తం 10 మంది చనిపోయారు. దీంతో స్పందించిన ఇరాన్ తీవ్ర ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. అయితే, ఇరాన్ కు యుద్ధంలో గెలిచేంత శక్తి లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్పేశారు.
ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే చమురు ధరలు పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. యుద్ధం జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని భారత్ తోపాటు ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారితీస్తుందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications