మూడేళ్ల రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి పుల్ స్టాప్?: చర్చల్లో అదే కీ పాయింట్
Russia- Ukraine conflict: రష్యా-ఉక్రెయిన్ మధ్య సంవత్సరాల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి.
ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.
రష్యా సైన్యానికి అంత తేలిగ్గా తలవంచట్లేదు ఉక్రెయిన్. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను సైతం విడిపించుకోగలిగింది.
అదే సమయంలో ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగడం రష్యాను ఆందోళనకు గురి చేసింది. రెండు రోజుల కిందటే లాంగ్ రేంజ్ మిస్సైల్తో రష్యాపై దాడి చేసింది ఉక్రెయిన్. అమెరికా అభివృద్ధి శక్తిమంతమైన క్షిపణి ఇది. ఈ మిస్సైల్ను సంధించడంతో తొలిసారిగా ఆత్మరక్షణలో పడినట్టయింది రష్యాకు.
దీనితో రష్యా అనూహ్య దాడికి దిగింది. కొద్దిరోజుల కిందట ఏకంగా ఉక్రెయిన్పై హైపర్సొనిక్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ను సంధించింది. దిన్ప్రో సిటీలో విధ్వంసాన్ని సృష్టించిందీ మిస్సైల్. భారీగా ఆస్తినష్టం సంభవించింది. అలాంటి మిస్సైళ్లను ఈ రెండు దేశాలు ఎన్నింటినో సంధించుకున్నాయి.
ఈ పరిస్థితులకు పుల్ స్టాప్ పడేలా ఉంది. ఈ రెండు దేశాల మధ్య శాంతిచర్చలు కొలిక్కి వచ్చాయి. వెయ్యిమంది యుద్ధ ఖైదీలను పరస్పరం మార్పిడి చేసుకోవడానికి రష్యా- ఉక్రెయిన్ అంగీకరించాయి. ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా సాగుతున్న శాంతి చర్చల సందర్బంగా 1,000 మంది యుద్ధ ఖైదీల మార్పిడి ఏకాభిప్రాయానికి వచ్చాయి.
ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రతినిధుల బృందానికి నాయకత్వాన్ని వహిస్తున్న ఆ దేశ రక్షణ శాఖ మంత్రి రుస్టెమ్ ఉమెరోవ్ వెల్లడించారు. ఎప్పుడు మార్పిడి చేసుకుంటారనే విషయాన్ని వెల్లడించలేదు. ఆ తేదీ గురించి వివరించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పుడే పూర్తి వివరాలను వెల్లడించలేమని తేల్చి చెప్పారు.
1,000 మంది యుద్ధ ఖైదీల పరస్పర మార్పిడి విషయాన్ని రష్యా ప్రతినిధుల బృందం అధిపతి వ్లాదిమిర్ మెడిన్ స్కీ కూడా ధృవీకరించారు. తన దేశ అధికారిక మీడియా ప్రతినిధులకు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతకుమించి- ఇతర వివరాలను తెలియజేయడానికి నిరాకరించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications