ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భారీ ఎటాక్.. చర్చల వేళ..
రష్యా మరోసారి ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడింది. డ్రోన్ లు, మిసైల్స్ తో ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. ఉక్రెయిన్ లోని కీవ్, ఖార్ఖివ్ నగరాల్లో ఈ దాడులు చేపట్టింది రష్యా. మరోవైపు అమెరికా- ఉక్రెయిన్- రష్యా మధ్య త్రి సభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా దాడుల్లో ఒకరు మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి.
మూడేళ్లకుపైగా భీకర యుద్ధం
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకుపైగా భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా మరోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలైన కీవ్, ఖార్ఖివ్ నగరాల్లో ఈ దాడులు చేపట్టింది రష్యా సైన్యం. ఈ డ్రోన్ దాడుల్లో ఒకరు మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. ఇక ఈ దాడులపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క శాంతి చర్చలు జరుగుతున్నా.. త్రిసభ్య సమావేశం జరుగుతున్నా.. ఉక్రెయిన్ ప్రజలకు మాత్రం మరో నిద్ర లేని రాత్రిగా ఈ రోజు మిగిలింది.. అని పేర్కొన్నారు.
త్రైపాక్షిక సమావేశం
ఇదిలాఉండగా యూఏఈలో జనవరి 23నుండి అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం జరగనుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దావోస్ అంతర్జాతీయ సదస్సు వేదికగా ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు రెండు రోజుల పాటు ఈ త్రైపాక్షిక సమావేశం జరగనుంది. 2022లో రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు ఒకే వేదికపై చర్చలు నిర్వహించనున్నారు.

మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దావోస్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జెలెన్ స్కీలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ముడేళ్లకుపైగా కొనసాగుతున్న యుద్ధం ముగియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications