Russia Ukraine War: పాక్ యువతి ఆస్మాను కాపాడిన భారత్, ప్రధాని మోదీ, భారతీయులకు థ్యాక్స్ !
ఉక్రెయిన్/రష్యా/న్యూఢిల్లీ: ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతున్న రష్యా దాని పంతం నెగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్ మెడలు వంచి తన దారికి తెచ్చుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసైడ్ అయిపోయాడు. చావోరేవో తేల్చుకోవాలి అంటూ ఉక్రెయిన్ కూడా రష్యాతో పోరాడుతూనే ఉంది. రష్యా యుద్దం ప్రకటించడంతో ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేష్ గంగా ఓ కొలిక్కి వచ్చింది. ఉక్రెయిన్ లోని సుమీ, కీవ్ తో పాటు ఇతర నగరాల్లో తలదాచుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకుని ప్రాణాలతో పోరాటం చేస్తున్న పాకిస్తాన్ కు చెందిన యువతిని భారత రాయభార కార్యాలయం అధికారులు రక్షించి ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. శత్రుదేశం అయిన భారత్ అధికారులు తన ప్రాణాలు కాపాడారని ఆ పాకిస్తాన్ యువతి ఉద్వేగానికి గురై చలించిపోయింది. ఉక్రెయిన్ లోని భారత్ రాయభార కార్యాలయం అధికారులు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి నా జీవితాంతం రుణపడి ఉంటానని పాకిస్తాన్ అమ్మాయి ఆస్మా షపీక్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Recommended Video

డిసైడ్ అయిపోయిన పుతిన్
ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతున్న రష్యా దాని పంతం నెగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్ మెడలు వంచి తన దారికి తెచ్చుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసైడ్ అయిపోయాడు. చావోరేవో తేల్చుకోవాలి అంటూ ఉక్రెయిన్ కూడా రష్యాతో పోరాడుతూనే ఉంది.

ఆపరేషన్ గంగా
రష్యా యుద్దం ప్రకటించడంతో ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేష్ గంగా ఓ కొలిక్కి వచ్చింది. ఉక్రెయిన్ లోని సుమీ, కీవ్ తో పాటు ఇతర నగరాల్లో తలదాచుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నారు. ఉక్రెయిన్ లో ఉంటున్న భారత పౌరులు అందర్ని భారత్ కు తీసుకువస్తామని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
పాకిస్తాన్ యువతికి సహాయం చేసిన భారత్
ఇదే సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకుని ప్రాణాలతో పోరాటం చేస్తున్న పాకిస్తాన్ కు చెందిన ఆస్మా షపీక్ యువతిని భారత రాయభార కార్యాలయం అధికారులు రక్షించి ఆమెను ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయంలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. శుత్రదేశం అయిన భారత్ అధికారులు తన ప్రాణాలు కాపాడారని ఆ పాకిస్తాన్ యువతి ఆస్మా షపీక్ ఉద్వేగానికి గురై చలించిపోయింది.

భారతీయుల రక్తంలోనే ఉంది
ఉక్రెయిన్ లోని భారత్ రాయభార కార్యాలయం అధికారులు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి నా జీవితాంతం రుణపడి ఉంటానని పాకిస్తాన్ అమ్మాయి ఆస్మా షపీక్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారత రాయబార కార్యాలయం అధికారులు రక్షించిన పాకిస్తాన్ యువతి ఆస్మా షపీక్ ఇప్పుడు పశ్చిమ ఉక్రెయిన్ చేరుకుని అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్లడానికి సిద్దం అవుతోంది. శత్రుదేశం పాకిస్తాన్ అయినా, ఏ దేశం ప్రజలు అయినా మేము సహాయం చేస్తామని, సహాయం చెయ్యడం ప్రతి భారతీయుడి రక్తంలో ఉందని, ఉక్రెయిన్ లో చిక్కుకున్న పాకిస్తాన్ అమ్మాయిని రక్షించడమే ఒక చిన్న ఉదాహరణ అని భారతీయులు ఇప్పుడు గర్వంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications