రష్యాకు ఎదురుదెబ్బ : ఉక్రెయిన్కు లొంగిపోతున్న సైనికులు.. భారీ ఆఫర్తో స్వాగతం ..!!
ఉక్రెయిన్పై రష్యా దళాలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. క్షిపణులు, మిస్సైల్స్తో దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. నగరాలను శ్మశానాలుగా మార్చేస్తోంది. నెల రోజులుగా రష్యా సేనలు ఉక్రెయిన్ పట్టణాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. కానీ పూర్తిస్థాయిలో పట్టుమాత్రం సాధించలేకపోయింది. ఉక్రెయిన్ సేనల ప్రతిఘటనలతో మాస్కో బలగాలు ముందుకు సాగలేకపోతున్నాయి. ఇప్పటికే దాదాపు 17వేల మంది రష్యా సైనికులను ఉక్రెయిన్ ఆర్మీ హతమార్చింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను కూల్చివేసింది, యుద్ధ ట్యాంకులను, వాహనాలను ధ్వంసం చేసింది.
Recommended Video


రష్యా యుద్ధ ట్యాంకులు స్వాధీనం
ఉక్రెయిన్ సేనల తీవ్ర ప్రతిఘటనలతో రష్యాకు లాజిస్టిక్ సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. దీంతో మాస్కో బలగాలలో ధైర్యం సన్నగిల్లి ముందుకు సాగలేకపోతున్నాయి. భీకర దాడులతో ఉక్రెయిన్ను హస్తగతం చేసుకుందామనుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహాత్మక ప్రణాళిక కాస్త గురితప్పుతోంది. తొలి రోజుల్లో ఉన్న ఊపు ప్రస్తుతం ఆదేశ సైనికుల్లో లేదని బ్రిటన్ ఇంటలిజెన్స్ రిపోర్టు పేర్కొంది. దాడుల్లో భాగంగా 1500 యుద్ధ ట్యాంకులను మాస్కో దింపితే వాటిల్లో 10 శాతానికి పైగా ట్యాంకులను ఉక్రెయిన్ సేనలు ధ్వంసం చేశాయి. అదే సమయంలో రష్కా సేనలు 34 ఉక్రెయిన్ ట్యాంకులను స్వాధీనం చేసుకున్నాయి. కానీ ఉక్రెయిన్ బలగాలు మాత్రం రష్యాకు చెందిన 117 ట్యాంకులను హస్తగతం చేసుకున్నాయి. దీంతో గతంలో కంటే ఉక్రెయిన్ యుద్ధట్యాంకుల బలం కాస్త పెరిగింది.

ఉక్రెయిన్కు లొంగిపోయిన మాస్కో సైనికుడు
మరోవైపు రష్యా సేనల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. వారిలో కొందరు ఉక్రెయిన్కు లొంగిపోతున్నారు. అంతే కాకుండా వారి ఆధీనంలో ఉన్న ఆయుధాలను అప్పగించేస్తున్నారు. తాజాగా రష్యా చెందిన మిషి అనే సైనికుడొకరు లొంగిపోయారు. తన వద్ద ఉన్న అత్యాధునిక టి-72 బి3 యుద్ధ ట్యాంకును కూడా ఉక్రెయిన్ పరం చేశాడు. దీని బదులుగా అతను ఉక్రెయిన్ పౌరసత్వంతో పాటు, 7,500 పౌండ్ల రివార్డును పొందనున్నాడు. తాము అర్థం లేని యుద్ధం చేస్తున్నామని ఆ సైనికుడు పేర్కొన్నట్లు ఉక్రెయిన్ మంత్రి విక్టర్ ఆండ్రుసివ్ తెలిపారు. మిషాను ప్రస్తుతానికి యుద్ధఖైదీగానే పరిగణిస్తున్నప్పటికీ.. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు విక్టర్ తెలిపారు. మాస్కో దళాలకు తినడానికి తిండి దొరకని పరిస్థితి నెలకొందన్నారు.

రష్యా పైలట్లకు భారీ ఆఫర్
మరోవైపు రష్యా యుద్ధవిమానాలను, హెలికాప్టర్లను స్వాధీనం చేసుకున్న వారిని ఉక్రెయిన్ ఆఫర్లు ప్రకటించింది. యుద్ధవిమానాన్ని స్వాధీనం చేసుకుని తమకు అప్పగిస్తే 10 లక్షల డాలర్లు అందిస్తామని తెలిపింది. అంతేకాదు హెలికాప్టర్కు 5లక్షల డాలర్లు , యుద్ధ ట్యాంకులకు కూడా ఇస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం ఉక్రెయిన్ సైనికులకే కాదు.. రష్యా పైలట్లకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది. రష్యా సేనలకు భంగపాటు తప్పదని .. లొంగిపోతే మీకే మంచిదంటూ ఉక్రెయిన్ హెచ్చరిస్తోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications