"మాపై ఈగ వాలినా ఆ దేశం ఊరుకోదు".. భారత్ కు పాకిస్థాన్ స్ట్రాంగ్ వార్నింగ్
పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య ఇటీవల జరిగిన రక్షణ ఒప్పందం ప్రకారం ఒకవేళ భారత్.. పాకిస్థాన్ పై దాడి చేస్తే సౌదీ అరేబియా భారత్ ను అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. ఇరు దేశాలపై ఏ దేశం దాడికి పాల్పడినా ఆ దేశాన్ని తమ శత్రువుగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య ఒప్పందం కుదిరినట్లు పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు.
పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ స్థానిక జియో టీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సౌదీ అరేబియాతో పాకిస్థాన్ కు రక్షణ ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ డీల్ మేరకు పాకిస్థాన్ పై ఒకవేళ భారత్ దాడికి పాల్పడితే అది సౌదీ అరేబియాపై దాడిగా ఇరు దేశాలు పరిగణిస్తాయని అన్నారు. వెంటనే సౌదీ దేశం భారత్ కు అడ్డుపడుతుందని ఈ మేరకు ఇరు దేశాల మధ్య బిగ్గెస్ట్ డిఫెన్స్ డీల్ కుదిరినట్లు ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ లోని అణు సామర్థ్యాలను సౌదీ అరేబియా వినియోగించుకోవచ్చని ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఇది అతిపెద్ద వివాదాస్పదమైన నిర్ణయం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఇటీల పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సౌదీ అరేబియాలో పర్యటించారు. రియాద్ లోని యమనా ప్యాలెస్ లో ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య సైనిక విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. అంతేకాక అడ్వాన్స్ డ్ డిఫెన్స్ టెక్నాలజీని ఇరు దేశాలు ఇచ్చి పుచ్చుకోనున్నాయి. అలాగే ఇంటెలిజెన్స్ విభాగాన్ని కూడా షేరింగ్ చేసుకోనున్నట్లు సమాచారం అందుతోంది.

మరోవైపు, సౌదీ అరేబియా-పాకిస్థాన్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంపై భారత్ తాజాగా స్పందించింది. ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దానిని మేం పరిశీలిస్తున్నామని వివరించింది. జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది! -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications