ఎంహెచ్ 370: అన్వేషిత ప్రాంతం రెండింతలు చేయనున్నారు
కౌలాలంపూర్: గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370 ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యల ప్రాంతాన్ని పెంచనున్నారు. గత ఏడాది మార్చి 8వ తేదీన ఐదుగురు భారతీయులు సహా 239 మంది ప్రయాణీకులతో కౌలాలంపూర్ నుండి బీజింగ్కు బయలుదేరిన ఎంహెచ్ 370 గల్లంతైంది.
ఈ విమానం కోసం ఎన్నో దేశాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు దాని ఆచూకీ లభించలేదు. దక్షిణ హిందూ మహా సముద్రంలో అరవై వేల చదరపు కిలోమీటర్ల మేర విమానం ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేదు.

దీంతో మరో అరవై వేల చదరపు కిలోమీటర్ల మేర అన్వేషణ చేపట్టాలని భావిస్తోంది. ఒకవేళ విమానం ఆచూకీ మే నెల లోపు దొరకకపోతే ఈ మేరకు ప్రయత్నాలు చేపట్టాలని యోచిస్తున్నారు. మలేషియాకు ఆస్ట్రేలియా, చైనాలు సహకరించేందుకు సంసిద్ధత తెలిపాయి.
ప్రస్తుతం నాలుగు నౌకలు ప్రస్తుతం అన్వేషిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అరవై శాతం మేర అన్వేషణ పూర్తయింది. మరో నలభై శాతం ఉంది. ఆ తర్వాత కూడా దొరకకపోతే, మే నెల తర్వాత అన్వేషణ ప్రాంతాన్ని మరో ఆరవై వేల కిలోమీటర్లకు పెంచనున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications