కొండ చివరన ‘సెల్ఫీ’ దంపతుల ప్రాణం తీసింది
లండన్: తమ ‘సెల్ఫీ' తీసుకోవాలని ఓ కొండపైకి ఎక్కిన దంపతులు అక్కడ్నుంచి ప్రమాదవశాత్తు జారీ పడటంతో తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాధ ఘటన పోర్చుగల్లో జరిగింది.
లిస్బన్ సమీపంలోని ప్రముఖ పర్యాటక స్థలమైన కోబో డి రోకా కొండపై నుంచి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఎవరూ లేనటువంటి కొండపైకి ఆ దంపతులు చేరుకున్నారు. ఆ తర్వాత వారు కొండ చివర తమ సెల్ఫీని తీసుకునేందుకు ప్రయత్నించారు.

అయితే వారు సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఉండగానే ప్రమాదశాత్తు వారు అక్కడి నుంచి జారిపడ్డారు. కొండ చాలా ఎత్తులో ఉండటంతో కిందపడిన ఆ దంపతులు తీవ్రగాయాలపాలై మృత్యువాతపడ్డారు.
ప్రమాద సమయంలో ఆ దంపతుల పిల్లలు ఒకరు ఐదేళ్లు, మరొకరు ఆరేళ్ల వయస్సున్న వారు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారు.
పోలాండ్కు చెందిన ఈ దంపతులు గత కొన్నేళ్లుగా పోర్చుగల్లో ఉంటున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. సోమవారం ఆ దంపతుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల క్రితం మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి సెల్ఫీ కోసం తుపాకీతో ఫోజు పెట్టి ప్రమాదశాత్తు గన్ పేలడంతో మృత్యువాత పడ్డాడు.












Click it and Unblock the Notifications