కొండ చివరన ‘సెల్ఫీ’ దంపతుల ప్రాణం తీసింది
లండన్: తమ ‘సెల్ఫీ' తీసుకోవాలని ఓ కొండపైకి ఎక్కిన దంపతులు అక్కడ్నుంచి ప్రమాదవశాత్తు జారీ పడటంతో తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాధ ఘటన పోర్చుగల్లో జరిగింది.
లిస్బన్ సమీపంలోని ప్రముఖ పర్యాటక స్థలమైన కోబో డి రోకా కొండపై నుంచి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఎవరూ లేనటువంటి కొండపైకి ఆ దంపతులు చేరుకున్నారు. ఆ తర్వాత వారు కొండ చివర తమ సెల్ఫీని తీసుకునేందుకు ప్రయత్నించారు.

అయితే వారు సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఉండగానే ప్రమాదశాత్తు వారు అక్కడి నుంచి జారిపడ్డారు. కొండ చాలా ఎత్తులో ఉండటంతో కిందపడిన ఆ దంపతులు తీవ్రగాయాలపాలై మృత్యువాతపడ్డారు.
ప్రమాద సమయంలో ఆ దంపతుల పిల్లలు ఒకరు ఐదేళ్లు, మరొకరు ఆరేళ్ల వయస్సున్న వారు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారు.
పోలాండ్కు చెందిన ఈ దంపతులు గత కొన్నేళ్లుగా పోర్చుగల్లో ఉంటున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. సోమవారం ఆ దంపతుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల క్రితం మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి సెల్ఫీ కోసం తుపాకీతో ఫోజు పెట్టి ప్రమాదశాత్తు గన్ పేలడంతో మృత్యువాత పడ్డాడు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications