పాకిస్తాన్లో మారణహోమం
Pakistan Blast: పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే భద్రత సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని క్వెట్టా సివిల్ ఆసుపత్రికి తరలించారు. చెల్లాచెదురైన మృతదేహాలు, క్షతగాత్రుల హాహాకారాలతో సంఘటన స్థలం భీతావహంగా కనిపించింది. అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో మార్మోగిపోయింది.

క్వెట్టా రైల్వే స్టేషన్లో ఈ ఉదయం 9 గంటల సమయంలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. క్వెట్టా- పెషావర్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్లడానికి కొద్దిసేపటి ముందు పేలుడు సంభవించింది. ఆ సమయంలో రైల్వే స్టేషన్లో వందమందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
పేలుడు ఘటనలో 21 మంది దుర్మరణం పాలైనట్లు క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ (ఆపరేషన్స్) మహ్మద్ బలోచ్ తెలిపారు. ఈ ఘటనకు ఆత్మాహూతి చర్యగా అనుమానిస్తోన్నారు. బలూచిస్తాన్ వేర్పాటువాద సంస్థలకు చెందిన ఆత్మాహూతి దళ సభ్యుడొకడు తనను తాను పేల్చుకొని ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తోన్నట్లు మహ్మద్ బలోచ్ చెప్పారు.
రైల్వే స్టేషన్కు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ను పిలిపించారు. అణువణువు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడ కూడా అనుమానిత వస్తువులు, పేలుడు పదార్థాలు లభించలేదని బలూచిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి షహీద్ రిండ్ తెలిపారు. గాయపడ్డ వారికి నాణ్యమైన చికిత్స అందిస్తోన్నామని చెప్పారు.
ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు క్వెట్టా పోలీసులు. ఉగ్రవాద చర్యగా కేసు నమోదు చేశారు. ఈ పేలుడు పట్ల పాకిస్తాన్ అధ్యక్షుడు యూసుఫ్ రజా గిలానీ, బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
బాంబు పేలుడు తరువాత క్వెట్టా నగరం వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు. మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశం ఉండొచ్చనే అనుమానాలతో క్వెట్టా రైల్వే స్టేషన్తో పాటు నగరంలో తనిఖీలు ముమ్మరం చేశారు.
-
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications