8 మంది గ్యాంగ్ రేప్: ఆమెను కర్రలతో కొడుతారట
ఇండోనేషియా: ఇండోనేషియాలో అత్యంత దురదృష్టకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం కలిగి ఉందనే ఆరోపణపై ఎనిమిది పురుషులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణపై ఆమెను బహిరంగంగా కర్రలతో కొట్టే శిక్ష విధించే అవకాశం ఉంది.
ఓ వివాహితుడితో తన ఇంట్లో అతనితో పాటు ఉన్నందుకు ఎనిమిది తనపై సామూహిక అత్యాచారం చేశారని పాతికేళ్ల ఆ విధవరాలు చెప్పింది. ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని వారు కొట్టారు. వారిని ఆ తర్వాత పోలీసులకు అప్పంగించారు.
ఈ దాడి గురువారంనాడు లోక్బానీ గ్రామంలో జరిగింది. ఆ విధవను, ఆ వ్యక్తిని మత చట్టాలను ఉల్లంఘించినందుకు నాలుగు సార్లు కర్రలతో కొట్టాలని జిల్లా ఇస్లామిక్ షియా చట్టు అధిపతి ఇబ్రహీం లతీఫ్ ఆదేశించారు.
మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినవారిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.