కొండచిలువను దొంగిలించి ప్యాంటులో ఇలా(వీడియో)
పోర్ట్లాండ్: ఏ దొంగైన సాధారణంగా దుకాణం లేదా షాపింగ్ మాల్కి వెళితే అక్కడ ఉన్న విలువైన వస్తువులు, డబ్బులు దొంగలిస్తాడు. కానీ, ఈ దొంగ మాత్రం పెట్ షాపునకు వెళ్లి ఏకంగా కొండ చిలువనే దొంగిలించాడు. అంతేగాక, దాన్ని తన ప్యాంటులో వేసుకుని దాచేసి అక్కడ్నుంచి ఉడాయించేశాడు. ఈ ఘటన అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఓరెగాన్ రాష్ట్రం పోర్ట్ల్యాండ్లో ‘ఏ టు జడ్ పెట్స్' అనే పెంపుడు జంతువుల దుకాణం ఉంది. దానిలో ఉండాల్సిన రెండడుగుల కొండచిలువ గత శుక్రవారం కనిపించకుండా పోయింది. దీంతో దుకాణ యజమానులు సీసీటీవీ ఫుటేజీల్ని పరిశీలించారు.

ఓ వ్యక్తి దాన్ని దొంగలించి తన ప్యాంటులో దాచి బయటకు తీసుకెళ్లిన దృశ్యాల్ని చూసి అవాక్కయ్యారు. ఈ విషయమై దుకాణ యజమాని బుజ్గన్ మాట్లాడుతూ.. అది పాము ఆహారం తీసుకునే రోజు కాదు కాబట్టి సరిపోయిందిగాని లేదంటే అతని పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పారు.
కాగా, దాని ధర 200 డాలర్ల వరకు ఉంటుందని తెలిపారు. పామును దొంగిలించినందుకు పోలీసులకు చెప్పి అతడిని అరెస్టు చేయించలేదని, ఆ దొంగ ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? అన్నీ తమకు తెలుసని చెప్పారు. అందుకని అతడే పామును వెనక్కి తీసుకొచ్చి ఇస్తాడని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications