Nepal Gen Z protest: సోషల్ బ్యాన్ పై భగ్గుమన్న నేపాల్-నిరసనల్లో ఆరుగురు మృతి..!
హిమాలయ ఖండ దేశం నేపాల్ లో ప్రభుత్వ అవినీతి, సోషల్ మీడియాలో దానిపై చర్చ జరగకుండా విధించిన నిషేధం దేశవ్యాప్త నిరసనలకు దారి తీశాయి. జెన్ జీ ఆగ్రహంతో హింసాత్మకంగా మారిన నిరసనలను అదుపు చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో ఆరుగురు పౌరులు చనిపోయారు. దాదాపు 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి.
నేపాల్ లో అధికారంలో ఉన్న కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంలో అవినీతి, బంధుప్రీతి పెరిగిపోవడం, ఉపాధి లేకపోవడం వంటి కారణాలతో యువతలో నైరాశ్యం నెలకొంది. అదే సమయంలో వీటిపై సోషల్ మీడియాలో చర్చ జరగకుండా ప్రభుత్వం ఏకంగా
26 యాప్స్ ను నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం మొత్తం వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో యువత రోడ్లపైకి వచ్చారు. జెన్ జడ్ విప్లవం పేరుతో బ్యానర్లు పట్టుకుని రూడ్లపై నిరసన ర్యాలీలు చేపట్టారు.

సోషల్ యాప్స్ పై నిషేధాన్ని ప్రభుత్వం నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ప్రకటించినప్పటికీ.. నిరసనకారులు మాత్రం దీనిని విమర్శనాత్మక స్వరాలను , వ్యవస్థీకృత భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి ఉద్దేశించిన ప్రత్యక్ష సెన్సార్షిప్ చర్యగా అభివర్ణిస్తూ ఆందోళనలకు దిగారు. ప్రభుత్వం ఫోన్ , ఇంటర్నెట్ లను నిషేధించడంతో జెన్ జీ యువకులు టిక్టాక్ , రెడ్డిట్ వంటి ప్రత్యామ్నాయ వేదికల వైపు మళ్లారు. వేలాది మంది యువ ప్రదర్శనకారులు గుమిగూడి, ప్రభుత్వానికి, దాని విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మార్చ్ మైతిఘర్ మండల వద్ద ప్రారంభమై పార్లమెంట్ భవనం వైపు సాగింది.
#WATCH | Nepal | Protest turned violent in Kathmandu as people staged a massive protest outside Kathmandu Parliament against the ban on Facebook, Instagram, WhatsApp and other social media sites, leading to clashes between police and protesters. pic.twitter.com/jifSQlHFqC
— ANI (@ANI) September 8, 2025
దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి నిరసనకారుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా యువత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగాలు కూడా చేశారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులపై వాటర్ బాటిల్స్ విసిరారు. ఈ దాడులు, ప్రతిదాడుల్లో ఆరుగురు నిరసనకారులు చనిపోయారు. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వం మాత్రం సోషల్ మీడియా బ్యాన్ ను సమర్ధించుకుంది.
-
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
ఈ చేపల్లో తేడాగా ఉన్నది ఏదో కనిపెట్టగలరా..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications