దేశాధ్యక్షుడు చనిపోతాడంటూ జోస్యం.. పోలీసుల అదుపులో జ్యోతిష్కుడు
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చనిపోతారంటూ తప్పుడు ప్రచారం చేసిన జ్యోతిష్కుడు విజిత రోహన విజేమునిని పోలీసులు అరెస్టు చేశారు.
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చనిపోతారంటూ తప్పుడు ప్రచారం చేసిన జ్యోతిష్కుడు విజిత రోహన విజేమునిని పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 27 లోపు అనారోగ్యంతోకానీ, ప్రమాదంలోకానీ సిరిసేన చనిపోతారంటూ సదరు జ్యోతిష్కుడు ప్రచారం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.
శ్రీలంక వాసులు జ్యోతిష్యాన్ని బాగా నమ్యుతుంటారు. ప్రస్తుతం జ్యోతిష్కుడి అవతారం ఎత్తిన విజేముని ఇంతకుమునుపు నేవీలో పని చేసేవాడు. 1989లో అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీలంకకు వచ్చినప్పుడు ఆయన్ని హత్య చేసేందుకు ప్రయత్నించిన నేరానికి శిక్ష కూడా అనుభవించాడు.

ఇప్పుడు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చనిపోతారంటూ సామాజిక మాధ్యమాలలో విజేముని వీడియోలు పెడుతుండడంతో ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.
ఇతడి కారణంగా ఏదో ఒక సమస్య తలెత్తుతుందని భావించిన మీడియా శాఖ సెక్రటరీ నిమల్ బోపేజ్.. విజేముని గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టమని గత డిసెంబర్ లోనే పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం విజేమునిని అరెస్టు చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications