ప్రధాని కల తుడిచిపెట్టుకుపోయింది: రాజపక్సకి చేదు
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సకి మళ్లీ భంగపాటు తప్పలేదు. పార్లమెంటు ఎన్నికలలో తుది ఫలితాల వెల్లడికి ముందే ఆయన తన ఓటమిని అంగీకరించాడు. ప్రధాని కావాలన్న తన కల తుడిచి పెట్టుకుపోయిందని రాజపక్స అన్నాడు.
ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెప్పాడు. యూపీఎఫ్ఏ ఓడిపోవడం చాలా బాధాకరమని చెప్పాడు. ప్రజల తీర్పును గౌరవిస్తానని రాజపక్స చెప్పాడు. అధ్యక్ష పదవి పోతే పోయిందని, ప్రధానిగానైనా సేవలు అందించాలన్న తన కల చెదిరిపోయిందన్నాడు.

రాజపక్స నేతృత్వంలోని యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడం అలయన్స్ పార్టీని, ప్రధాని రనిల్ విక్రమ సింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ ఓడించింది. ఓ యుద్ధంలో బాగా పోరాడి తాము ఓడిపోయామని రాజపక్స అన్నాడు.
మొత్తం 22 జిల్లాలు ఉండగా తాము 8 చోట్ల మాత్రమే విజయం సాధించామని చెప్పాడు. అధ్యక్ష పదవిని కోల్పోయిన ఏడు నెలల అనంతరం ఆయన ప్రధాని పీఠంపై కూర్చోవాలని చేసిన ఆలోచనలనూ ప్రజలు తిప్పికొట్టారు. శ్రీలంక చరిత్రలో అత్యంత ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు ఇవేనని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వ్యాఖ్యానించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications