శ్రీలంక అధ్యక్షుడు ఇలా పారిపోయాడు.. సీక్రెట్ బంకర్, లిప్ట్ ద్వారా కిందకి
శ్రీలంక జనం నిరసనలతో ప్రధాని రాజీనామా చేయగా.. అధ్యక్షుడు పారిపోయారు. పార్టీ కొత్త నేతను ఎన్నుకోనుంది. అయితే అధ్యక్షుడు గొటబయ రాజపక్సే 13వ తేదీన రాజీనామా చేసేందుకు అంగీకరించారు. కానీ అతని నివాసం వద్దకు ఆందోళనకారులు రావడంతో అంతకుముందు పారిపోయారు. ఆయన ఎప్పటిలాగా రాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంకర్ ద్వారా బయటకు వచ్చారు. ప్రెసిడెంట్ ప్యాలెస్ వద్ద ఉన్న హై సెక్యూరిటీ బంకర్ను ఇండియా టుడే కనుగొంది. ఇక్కడినుంచి పారిపోయారని తెలిపింది.
ఇది అత్యంత సురక్షితమైన బంకర్.. తలుపు కనిపించదు. గదిని మెల్లగా తీయాలి.. అలాగే లిప్ట్ ద్వారా కిందకు వెళ్లాల్సి ఉంటుంది. అలా ఆయన పారిపోయారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పీక్కి చేరింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలను చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో జనం ఆందోళనకు దిగారు.ప్రధాని విక్రమసింఘే, అధ్యక్షుడు రాజపక్సేను రాజీనామా చేయాలని కోరారు. దీంతో ప్రధాని రాజీనామా చేసి వెళ్లిపోయారు. అధ్యక్షుడు రిజైన్ చేయకముందే వెళ్లి పోయారు.
ప్రధాని విక్రమసింఘే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మంత్రి బందుల గుణవర్దన రిజైన్ చేశారు. ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది జర్నలిస్టులపై దాడి చేశారు. ఘటనను అంతా ఖండించారు. మరోవైపు పార్టీ నేతలు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని స్పీకర్ అధ్యక్షుడు రాజపక్సేకు తెలియజేశారు. దీంతో అధ్యక్షుడు కూడా 13వ తేదీన రాజీనామా చేస్తారని తెలిసింది. శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో విక్రమసింఘే తన నిర్ణయాన్ని తెలియజేశారు. శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో.. విక్రమసింఘే పదవీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు రాజపక్సే కూడా రాజీనామా చేయక తప్పని పరిస్థితి.