అఫ్గన్లో మరో ఆత్మాహుతి దాడి: 11మంది చిన్నారులు బలి
కాబూల్: ఆఫ్గనిస్తాన్ పేలుళ్లతో దద్దరిల్లుతోంది. సోమవారం జంట పేలుళ్లు సంభవించిన గంటల వ్యవధిలోనే కాందహార్ పట్టణంలో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 11మంది చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.
కాందహార్ లోని డమన్ కి చెందిన రొమేనియన్ పెట్రోలింగ్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్టు తెలుస్తోంది. స్థానిక అధికారులు సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. పేలుడు సంభవించిన ప్రాంతానికి సమీపంలోనే ఓ స్కూల్ కూడా ఉంది. అయితే ఆ సమయంలో చిన్నారులంతా లోపలే ఉండటంతో పెనుప్రమాదం తప్పింది.

ఘటనలో మొత్తం 11మంది చిన్నారులు మృతి చెందగా.. మరో 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురు రొమేనియా సైనికులు, ఇద్దరు అఫ్గాన్ పోలీసులు ఉన్నట్టు సమాచారం.
కాగా, గతేడాది సెప్టెంబర్ లోనూ కాందహార్ లో కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు రొమేనియన్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. తాజా పేలుళ్లు ఎవరి పని అయి ఉంటుందన్నది ఇంకా తేలలేదు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications