Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రార్థనలు చేస్తున్నా వదలలేదు: 150 మంది కాల్చివేత

నైజీరియా: మసీదులలో ప్రార్థనలు చేస్తున్న వారిని, ఇంటిలో వంట చేస్తున్న మహిళలు, ఆడుకుంటున్న పిల్లలను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంఘటన ఈశాన్య నైజీరియాలో జరిగింది. ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

ఈశాన్య నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలోని మూడు మారుమూల గ్రామాలలో ముస్లీంలు చాల మంది నివాసం ఉంటున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా గురువారం రాత్రి మగాళ్లు మసీదులలో ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లారు.

Suspected Boko Haram militants killed nearly 150 people in Nigeria

ఉదయం నుండి ఉపవాసంతో ఉన్న వారికి బోజనం పెట్టడానికి మహిళలు ఇంట్లో వంటలు చేస్తున్నారు. ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారు. అదే సమయంలో నైజీరియాలోని బోకో హరాం ఉగ్రవాదులు మోటారు బైక్ లలో అక్కడికి వెళ్లారు.

తరువాత వెంట తీసుకు వెళ్లిన అత్యాధునిక తుపాకులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు. మసీదులు, ఇండ్లు, ఇండ్ల ముందు శవాలు కుప్పలుకుప్పలుగా పడిపోయాయి. అనేక మందికి బుల్లెట్ గాయాలైనాయి. ఉగ్రవాదుల కసి తీరడంతో అక్కడి నుండి పరారైనారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+