70ఏళ్లు పాలించిన థాయ్ రాజు భూమిడోల్ కన్నుమూత
బ్యాంకాక్: సుదీర్ఘకాలంపాటు థాయ్లాండ్కు రాజుగా కొనసాగుతున్న భూమిబోల్ అదుల్యదేజ్(88) గురువారం కన్నమూశారు. ఆయన వయసు 88. 1946 సోదరుడి మృతితో థాయ్ సింహాసనాన్ని అధిరోహించిన ఆయన దివ్యాంశ సంభూతుడిగా...సాక్షాత్ భగవత్ స్వరూపంగా ప్రజల నుంచి అపార గౌరవాన్ని అందుకున్నారు.
ఆయన.. థాయ్లాండ్ను అత్యధిక కాలం పరిపాలించిన రాజుగా ప్రత్యేకత సాధించారు. సుమారు 70 ఏళ్లపాటు పరిపాలించిన ఆయనను 'రామా 9'గా కూడా వ్యవహరిస్తారు. ఎంతో కాలం నుంచీ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.52 గంటలకు మరణించినట్లు రాజప్రాసాదం విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది.

యువరాజు మహా వజిరలాంకోర్న్, యువరాణులు మహా చక్రి సిరింధోర్న్, సోంసావాలీ, ఛులభోర్న్లు ఆ సమయంలో ఆస్పత్రిలో అదుల్యదేజ్ వెంటే ఉన్నారు.
యువరాజు మహా వజిరలాంకోర్న్(63) ఇప్పుడిక థాయ్లాండ్ రాజు అవుతారు. ప్రధానమంత్రి ప్రయుత్ ఛాన్-ఓఛా గురువారం టీవీలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకటించారు.
భూమిబోల్ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. నేటి కాలానికి చెందిన గొప్ప నాయకుల్లో ఆయన ఒకరని అన్నారు. ఆయనను కోల్పోయిన థాయ్లాండ్ ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications