ఘోర ప్రమాదం: రైలుపై పడ్డ భారీ క్రేన్.. 22 మంది దుర్మరణం
థాయ్లాండ్లో బుధవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. చైనా మద్దతుతో నిర్మిస్తున్న హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుకు చెందిన ఓ భారీ క్రేన్ కూలి రైలుపై పడిన ఘటనలో దాదాపు 22 మంది మరణించగా.. 80 మందికి పైగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే?
బ్యాంకాక్ నుంచి ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్కు వెళ్తున్న రైలు.. నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్లోని సిఖియో జిల్లా గుండా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అక్కడ జరుగుతున్న హై-స్పీడ్ రైల్వే నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న ఓ భారీ క్రేన్ అకస్మాత్తుగా రైలు బోగీలపై కూలిపడింది. దీనివల్ల రైలు పట్టాలు తప్పడమే కాకుండా, స్వల్పంగా మంటలు కూడా అంటుకున్నాయి.

మృతులు, క్షతగాత్రులు
స్థానిక పోలీసు చీఫ్ తచ్చపోన్ చిన్నవాంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 80 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో రైలులో సుమారు 195 మంది ప్రయాణికులు ఉన్నట్లు థాయ్లాండ్ రవాణా మంత్రి పిపట్ రాట్చకిట్ప్రకర్ వెల్లడించారు.
A train accident has killed 22 people and injured another 80 when a crane crushed the locomotive in Thailand. #thailand #train #crane #accident #crash pic.twitter.com/zoV41EpUtD
— 7NEWS Australia (@7NewsAustralia) January 14, 2026
సహాయక చర్యలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. రైలు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెస్క్యూ సిబ్బంది గ్యాస్ కట్టర్ల సహాయంతో ఇనుప భాగాలను కట్ చేసి లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. అగ్నిమాపక దళం, మెడికల్ టీమ్స్, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
చైనా-థాయ్లాండ్ రైలు ప్రాజెక్టు
కూలిపోయిన క్రేన్ సుమారు 5.4 బిలియన్ డాలర్ల(రూ. 45 వేల కోట్లకు పైగా) విలువైన హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులో భాగం. చైనా ప్రతిష్టాత్మక 'బెల్ట్ అండ్ రోడ్' ఇనిషియేటివ్లో భాగంగా బ్యాంకాక్ నుంచి చైనాలోని కున్మింగ్ను కలుపుతూ ఈ రైల్వే లైన్ను నిర్మిస్తున్నారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. థాయ్లాండ్లో భద్రతా ప్రమాణాల విషయంలో తరచూ విమర్శలు వస్తుంటాయి. ఈ తాజా ప్రమాదం నేపథ్యంలో, క్రేన్ ఎందుకు కూలిపోయింది, దీనికి బాధ్యులు ఎవరనే విషయంపై థాయ్ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications