మానవత్వం కలిపింది: పాక్కు థ్యాంక్స్, మోడీకి షరీఫ్ కూతురు
న్యూఢిల్లీ/లాహోర్: ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియమ్ నవాజ్ షరీఫ్లు పరస్పరం థ్యాంక్స్ చెప్పుకున్నారు! యెమన్లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడి భారతీయులను మన దేశానికి తరలించింది/తరలిస్తోంది. వేలాది మందిని తరలించింది.
అయితే, పాకిస్తాన్ దేశం కూడా కొందరు భారతీయులను తీసుకు వచ్చింది. పాకిస్తాన్ పదకొండు మంది భారతీయులను యెమన్ నుండి తీసుకు వచ్చింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. బుధవారం ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
పాకిస్తాన్ సహకారంతో వచ్చిన భారత్కు చెందిన పదకొండు మంది సిటిజన్స్కు స్వాగతం పలుకుతున్నానని, ఇందుకు తాను పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్కు ధన్యవాదాలు చెబుతున్నానని, షరీఫ్దీ మానవతా దృక్పథమని కొనియాడారు.

సేవ చేసేందుకు ఎలాంటి హద్దులు (బార్డర్) ఉండదని ట్వీట్ చేశారు. యెమన్ నుండి బాధితులను తీసుకు వచ్చేందుకు ఎన్నో దేశాలు ముందుకు వస్తున్నాయని అది సంతోషమన్నారు.
మోడీ ట్వీట్ పైన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియమ్ నవాజ్ షరీఫ్ స్పందించారు. మోడీ స్పందనకు అతనికి ధన్యవాదాలు అని, మా భారత స్నేహితులు భద్రంగా ఇంటికి చేరుకున్నారని, మానవత్వం మనలను ఒకటి చేస్తుందని అన్నారు.
-
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications