ఎంహెచ్ 17: టీనేజ్ కూతుర్ని కోల్పోయిన తండ్రి థ్యాంక్స్
కౌలాలంపూర్: మలేషియా విమానం ఎంహెచ్ 17 ప్రమాదంలో తన కూతురును పోగొట్టుకున్న ఓ డచ్ తండ్రి రష్యా అధ్యక్షులు వ్లాదిమర్ పుతిన్కు లేఖ రాశాడు. ఈ ప్రమాదంలో అతను తన ఒక్కగానొక్క పదిహేడేళ్ల కూతురును పోగొట్టుకున్నాడు. దీనిపై పుతిన్కు వ్యంగ్యంగా కృతజ్ఞతలు చెప్పాడు.
ఈ మేరకు తండ్రి ఓ బహిరంగ లేఖ రాశాడు. తన ముద్దుల కూతురు ఎల్స్ మిక్ (17)ను చంపిన పుతిన్, వేర్పాటువాద నాయకులు లేదా ఉక్రెయిన్ గవర్నమెంట్కు చాలా కృతజ్ఞతలని, హఠాత్తుగా ఆమె చనిపోయిందని, ఓ విదేశం చేసిన యుద్ధం వల్ల ఆకాశంలోనే విమానాన్ని కాల్చేశారని, వచ్చే ఏడాదిలో తన స్నేహితురాలు జూలియాతో తన కుమార్తె పాఠశాల విద్యను పూర్తి చేయనుందని అందులో పేర్కొన్నాడు.

తర్వాత డెల్ఫ్ విశ్వవిద్యాలయంలో ఆమె సివిల్ ఇంజినీరింగ్ చేయాలనుకుందని, అందుకు బాగా ఎక్సైట్ అయిందని, కానీ తన జీవితాన్ని నాశనం చేసినందుకు మీరు గర్వపడుతున్నారని అనుకుంటున్నానని, ఈ సందేశాన్ని త్వరలో మీరు (పుతిన్) తప్పక చదువుతారని, లేదా మీ సహాయకులు మీకు చెబుతారని అనుకుంటున్నాంటూ వ్యంగ్యంగా ఆ తండ్రి తన ఆవేదనను వెల్లడించాడు. ఈ లేఖను డచ్ మీడియా ప్రచురించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications