చైనాలో భూకంపం 11 మృతి... వందలాదీ మందికి గాయాలు...
చైనాలో సియాచిన్ ప్రావిన్స్లో గత అర్థరాత్రీ రెండు భూమి కంపించింది. ఈ భూకంపంలో 11 మంది మృత్యువాత పడగా వంద మందికి పైగా గాయలపాలయ్యారు. చైనాలోని మెట్రో పోలీస్ , మరియు చెంగ్డూ ప్రాంతాల్లో భూకంప ప్రభావం కంపించింది. దీంతో ప్రజలు అర్ధరాత్రీ పూట ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చారు. భూకంప ప్రభావం సమాచారం అందుకున్న విపత్తు నివారణ సంస్థలు అక్కడికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. పలు బిల్డింగ్ల క్రింద సజీవంగా ఉన్న వారిని కాపాడారు. ఈనేపథ్యంలోనే 122 మంది గాయపడ్డారని తెలిపారు. దీంతో గాయపడ్డవారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించాయి.
ఇక భూకంపం వచ్చిన ప్రాంతం గ్రామీణ ప్రాంతం కావడంతో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు.ఇక భూకంపం జరిగిన దృశ్యాలను సైతం అక్కడి స్థానిక ప్రజలు సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు. దీంతో భాదితులను ఆధుకునేందుకు సహయచర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు రిక్టర్ స్కేల్పై 5.9 గా భూకంపం తీవ్రత నమోదైనట్టు, దాని ప్రభావం భూకంప కేంద్రం నుండి దాదాపు 10 కి.లో మేర పడినట్టు అధికారులు తెలిపారు.ఇక 2008లో సిచువాన్ ప్రాంతంలో వచ్చిన భూకంపం వల్ల సుమారు 70 మంది ప్రజలు చనిపోయారు.